లాడన్కు తాలిబన్ల మద్దతు
కరాచిః అమెరికాలో ఉగ్రవాదులు సృష్టించిన విలయంలో ఒసామా బిన్ లాడన్ హస్తం వున్నదని తాము భావించడం లేదని అఎn్గానిస్తాన్లో తాలిబన్ల సుప్రీం కమాండర్ ముల్లా మహమ్మద్ ఒమర్ శుక్రవారం నాడు ప్రకటించారు.
అమెరికాపై దాడుల్లో ఒసామాబిన్ లాడన్ హస్తం వున్నదనే అనుమానంతోఅఎn్గాన్లోని టెర్రరిస్టుల కేంద్రాలపై అమెరికా దాడులు జరిపే అవకాశం వున్నదన్న వార్తలకు తాము బెదిరేది లేదని ఆయన చెప్పారు. ఒసామాను తాలిబన్లు గట్టిగా వెనకేసుకువచ్చారు. ఒసామాకుపైలెట్లు లేరని ఒక వేళ అమెరికా చెబుతన్నట్టుగా వున్నా వారికి ఆయన శిక్షణ ఎక్కడ ఇవ్వగలరని ముల్లా ఒమర్ విడుదల చేసిన ఒక ప్రకటనలో ప్రశ్నించారు.అఎn్గానిస్తాన్ పైలెట్ల శిక్షణ సౌకర్యాలు లేవని ఆ ప్రకటనపేర్కొంది.
డబ్లుటిసిపై జరిగిన దాడులను గమనిస్తే అవి బాగా శిక్షణ పొందినపైలెట్లు చేసిన దాడులే తప్ప సాధారణ వ్యక్తులు చేసిన దాడులు కావన్నవిషయం స్పష్టంగా వెల్లడవుతుందని ఆ ప్రకటనపేర్కొంది. అకారణంగా ఈ సంఘటనలతో ఒసామా పేరును ముడిపెట్టే ప్రయత్నం జరుగుతున్నదని కూడా తాలిబన్ ప్రభుత్వం ఆరోపించింది.
ఇదిలా వుండగాబిన్ లాడెన్ విషయంలో అమెరికా ప్రయత్నాలకు ఎలాంటి మద్దతు ఇవ్వరాదని పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న తీవ్రసంస్థలు పాకిస్తాన్ ప్రభుత్వాన్ని గట్టిగా డిమాండ్ చేశాయి. లష్కర్ ఎ తోయిబా పత్రికలకు విడుదల చేసిన ఒక ప్రకటనలోజిహాద్ కొనసాగుతుందని ప్రకటించింది. హిజ్బుల్ ముజాహిదీన్ కూడా లాడన్కు మద్దతు ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా ముస్లీంలకు వ్యతిరేకంగా అమెరికానే టెర్రరిస్టు కార్యకలాపాలను నిర్వహిస్తున్నదని పాక్ తీవ్రవాద సంస్థలు ఆరోపించాయి.
సంబంధిత వార్తలుః
- గుట్టలు గుట్టలుగా శవాలు
- 50 మందిని గుర్తించిన ఎఫ్బిఐ
- సమాచారం కోసం ఆంధ్రుల ఆరాటం
- ఆఫ్రో-ఆసియా క్రీడలు వాయిదా
- ఉమ్మడిపోరుకు నాటో ప్రకటన
- లాడన్పైనే అమెరికా అనుమానం
- దాడులతోసంబంధం లేదన్న లాడెన్
- మన ఆర్థికరంగంపై ప్రభావం వుండదు: సిన్హా
- కార్యక్రమాలురద్దు చేసుకున్న ప్రధాని
- దాడులుమేమే చేశాం: లష్కర్
- అమెరికాపేలుళ్ళు-ఆంధ్రుల ఆందోళన
- అమెరికా పేలుళ్ళు-ఆంధ్రుల ఆందోళన
- మారణహోమంలో వేలాదిమంది దుర్మరణం?
- ముందేహెచ్చరించిన లాడెన్
- గాడాంధకారంలోఆంధ్రప్రదేశ్
- ప్రతీకారంతీర్చుకుంటాం: బుష్
- కాబూల్లోపేలుళ్లు మాపని కాదుఃయుఎస్
- అమెరికాఅగ్నిగుండమైన క్రమం...
- అమెరికాలోటెర్రరిస్టుల బీభత్సం
-
భారత్దిగ్భ్రాంతి,
అత్యవసర
సమావేశం