వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తుంగభద్రపై కర్నాటకతో చర్చః బాబు

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌ః తుంగభద్ర ఎగువకాలువకు సమాంతరంగా మరో కాలువను నిర్మించే విషయంపై కర్నాటక ప్రభుత్వంతో మాట్లాడతామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసెంబ్లీకి హామీ ఇచ్చారు. తుంగభద్ర కాలువ రిజర్వాయర్‌ లో పూడిక పేరుకుపోయి కనీసం నీరు రాని పరిస్థితి ఏర్పడిందని, అందువల్ల మరో కాలువ తవ్వితే అనంతపురం జిల్లాకు కనీసం తాగునీరైనా లభిస్తుందని ఆ జిల్లాకు చెందిన తెలుగుదేశం, కాంగ్రెస్‌ ఎమ్మెల్ల్యేలు ముక్తకంఠంతో డిమాండ్‌ చేసారు.

ఈ వ్యవహారాన్ని కర్నాటకతో చర్చించి త్వరిత గతిన పనులు ప్రారంభించాలని కాంగ్రెస్‌ వారు డిమాండ్‌ చేశారు. అనంతపురంలో వర్షాకాలంలో సైతం మంచినీళ్ళు లేకపోవడం చూస్తే పరిస్థితి ఎంత దయనీయంగా వున్నదోఅర్థం చేసుకోవాలని వారు కోరారు. ఇందుకు భారీ నీటిపారుదల శాఖ మంత్రి మండవ వెంకటేశ్వర రావు ఇచ్చిన సమాధానం పట్ల సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. చేస్తాం... చూస్తాంఅంటారే తప్ప మంత్రి గారు ఖచ్చితమైన హామీ ఇవ్వడం లేదని నిరసన వ్యక్తం చేశారు.

ఈ సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జోక్యం చేసుకొని సభ్యుల ఆందోళననుఅర్థం చేసుకున్నామన్నారు. తుంగభద్ర కాలువపై కర్నాటక ముఖ్యమంత్రి కృష్ణతో చర్చించి తగు చర్యలు తీసుకుంటామని చంద్రబాబు హామీ ఇవ్వడంతో సభ్యులు శాంతించారు.
స్పాట్‌లైట్‌ః ఆంధ్ర అసెంబ్లీ స్పెషల్‌

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X