వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాబు - వై.ఎస్‌. రసవత్తర చర్చ

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌ః అసెంబ్లీ సమావేశాలను మరో నాలుగు రోజులు పొడిగించే అంశంపై శుక్రవారం అసెంబ్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ప్రతిపక్ష నేత వై.ఎస్‌. రాజశేఖర రెడ్డి మధ్య రసవత్తరమైన చర్చ జరిగింది. రాష్ట్రంలో కరవు, రైతుల ఆత్మహత్యలు, తాగేందుకు నీళ్ళు లేక ప్రజలు అల్లాడిపోతున్న తరుణంలో అసెంబ్లీ సమావేశాలను మొక్కుబడిగా వారం రోజులే జరపడం తగదని వై.ఎస్‌. అన్నారు. అయితే అసెంబ్లీ సమావేశాలను పొడిగించేందుకు ప్రభుత్వం మొదటి నుంచి విముఖంగా వుంది.

కరవుతో జిల్లాల్లో పరిస్థితి దారుణంగా వుంటే ఎమ్మెల్ల్యేలుఅసెంబ్లీలో కూర్చోవడం తగదని చంద్రబాబు నాయుడు అన్నారు.

మూడు నెలలుగా కరవు వుంటే జిల్లాల ముఖం చూడని ఎమ్మెల్ల్యేలు మరో నాలుగు రోజులు వారి నియోజక వర్గాలకు దూరంగా వుంటే నష్టం లేదని వై.ఎస్‌. అన్నారు. సాధ్యమైనన్ని ఎక్కువ రోజులుఅసెంబ్లీ జరగాలని ఈ సారి నాలుగు రోజులు పొడిగిస్తే వచ్చే ఏడాది మరో నాలుగు రోజులు పొడిగిద్దామని వై.ఎస్‌. అడిగారు. ఆ తరువాత కాంగ్రెస్‌ ప్రభుత్వం వస్తే ఖచ్చితంగాఅసెంబ్లీ సమావేశాలను పొడిగిస్తామని వై.ఎస్‌. అనే సరికి సభలో నవ్వులువిరిసాయి.

ఇంతలో చంద్రబాబు నాయుడు జోక్యం చేసుకొని కాంగ్రెస్‌ వారు, ముఖ్యంగా వై.ఎస్‌. రాజశేఖర రెడ్డి అధికారంలోకి రావాలని బాగా కలలు కంటున్నారు.మీ కలలు కల్లలుగానే మిగిలిపోతాయి. మీరు అధికారంలోకి రాలేరని నవ్వుతూ అన్నారు. చంద్రబాబు వ్యాఖ్యలతో తెలుగుదేశం సభ్యులు బల్లలు చరిచి హర్షం వ్యక్తంచేశారు.

స్పాట్‌ లైట్‌ఃఆంధ్ర అసెంబ్లీ స్పెషల్‌

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X