వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అవినీతి అంతానికిస్వతంత్ర సంస్థ

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: రాష్ట్రంలో అవినీతి నిర్మూలనకు చట్టబద్దమైనస్వతంత్ర సంస్థను ఏర్పాటు చేసే ఆలోచన వున్నదని రెవెన్యూ మంత్రిపి. అశోక్‌ గజపతి రాజు చెప్పారు. అవినీతి నిరోధక శాఖ(ఎసిబి) కేసుల గురించి సభ్యులు ప్రశ్నోత్తరాల సమయంలో చేసిన ప్రస్తావనలకు ఆయన జవాబిచ్చారు. అవినీతి నిర్మూలనకు ఏర్పాటు చేయబోయేస్వతంత్ర సంస్థ ఏర్పాటు కోసం మంత్రి వర్గ ఉప సంఘం అధ్యయనం చేస్తోందని మంత్రి చెప్పారు. అవినీతి నిర్మూలనకు ఇతర దేశాల్లో ఉన్న సంస్థలను కూడా అధ్యయనం చేస్తున్నట్లు ఆయన తెలిపారు.

ఎసిబి కేసులవిచారణకు ఐదు ప్రత్యేక న్యాయస్థానాలను ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. ఈ సంఖ్యనుపెంచే అవకాశాలు లేవని ఆయన చెప్పారు. రాష్ట్రంలో 590 ఎసిబి కేసులను న్యాయస్థానాలువిచారిస్తున్నాయని ఆయన అన్నారు. అవినీతికి సంబంధించి రెండు ప్రధానఅంశాలున్నాయని, ఒకటి అవినీతిని నిరోధించడం కాగా రెండవది అవినీతిని అరికట్టడమని ఆయన అన్నారు. అవినీతిఅంతానికి ప్రభుత్వం కట్టుబడి వున్నదని, ఇందుకు ప్రజల మద్దతుఎంతైనా అవసరమని ఆయన అన్నారు.

స్పాట్‌ లైట్‌ఃఆంధ్ర అసెంబ్లీ స్పెషల్‌

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X