శ్రీశైలంలోనూ రోప్వే
హైదరాబాద్:శ్రీశైలంలో కూడా తిరుపతిలో మాదిరిగా రోప్ వే నిర్మాణ పనులను చేపట్టనున్నట్లు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు చెప్పారు. శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో శనివారం మంత్రి ఈవిషయం చెప్పారు. శ్రీశైలం దేవస్థానాన్ని అభివృద్ధి చేయడం లేదని భారతీయ జనతా పార్టీ (బిజెపి) సభ్యులు చేసినవిమర్శలకు మంత్రి జవాబు ఇచ్చారు.
విదేశీ సహాయంతోశ్రీశైలంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలవివరాలను కె. లక్ష్మణ్ (బిజెపి) ప్రభుత్వాన్ని అడిగారు.శ్రీశైలంలో 2.10 కోట్ల రూపాయల వ్యయంతో ఆస్పత్రి, కళ్యాణమండపం నిర్మాణాలను చేపడుతున్నట్లుమంత్రి శివరామరాజు చెప్పారు.
ఉర్దూ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం
రాష్ట్రంలో ఉర్దూ భాష అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి వున్నదని రాష్ట్ర ప్రాథమికవిద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి చెప్పారు. మజ్లీస్, కాంగ్రెస్ సభ్యులు అడిగిన ప్రశ్నలకు శనివారం శాసనసభలో సమాధానం ఇస్తూ మంత్రి ఆవిషయం చెప్పారు. రాష్ట్రంలోని 37 ప్రాథమికోన్నత పాఠశాలలను ఉన్నత పాఠశాలలుగా అప్గ్రేడ్ చేస్తామని, ఈవిషయమై త్వరలో ఉత్తర్వులు జారీ చేస్తామని ఆయన చెప్పారు. ఇప్పటికే 72 ప్రాథమిక పాఠశాలలను ప్రాథమికోన్నత పాఠశాలలుగా అప్గ్రేడ్ చేసినట్లు ఆయన తెలిపారు. ఇటీవల జరిగిన డిఎస్సి పరీక్షల ద్వారా ఉర్దూ పాఠశాలల్లో ఉన్న ఉపాధ్యాయ పోస్టుల ఖాళీలను భర్తీ చేస్తామని కూడా మంత్రి హామీ ఇచ్చారు.
నేపాల్లో యాత్రీ నివాస్ ఏర్పాటు, నాగార్జున సాగర్ అభివృద్ధి పనులు, కృష్ణాజలాలు, తదితరవిషయాలు ప్రశ్నోత్తరాల సమయంలో శాసనసభలో ప్రస్తావనకు వచ్చాయి.
స్పాట్
లైట్ఃఆంధ్ర
అసెంబ్లీ
స్పెషల్