వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కరవు సాయానికి 321 కోట్లు

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌ః కరవు పీడితులకు సాయం అందజేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం పలు చర్యలను ప్రకటించింది. శాసన సభలో రెండు రోజుల పాటు జరిగిన కరవు చర్చకు సమాధానమిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 321 కోట్ల రూపాయల కరవు ప్యాకేజీని ప్రకటించారు.

కరవు పెన్షన్లకింద 24 కోట్ల రూపాయలు, సహకార రుణాలపై వడ్డీ రాయితీ కింద 164 కోట్ల రూపాయలు సాయంప్రకటించారు. వీటితో పాటు విద్యుత్‌ సర్‌చార్జీలో 66 కోట్ల రూపాయలమేర మాఫీని కూడా ప్రకటించారు.

విత్తనాల సబ్సిడీకి పదికోట్ల రూపాయలు, పశు సంరక్షణ శిబిరాల నిర్వహణకు ఏడుకోట్లు, ఉపాధి కల్పనా పనులకు మార్కెటింగ్‌ నిధులు 50 కోట్ల రూపాయలు ఇస్తున్నట్టుగా ముఖ్యమంత్రి ప్రకటించారు. కరవు పీడిత ప్రాంతాల్లోని వృద్దులకు, అనాధలకు, ఎనిమిది నెలలపాటు తలకు 75 రూపాయల చొప్పున పెన్షన్‌ మంజూరు చేస్తారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X