హత్యలపై కాంగ్రెస్ ఆగ్రహం
హైదరాబాద్ః
ప్రత్యర్ధులను
తుదముట్టించే
రహస్య
ఎజెండాను
అధికార
పార్టీ
అమలు
చేస్తున్నదని
కాంగ్రెస్
పార్టీ
సభ్యులు
ఆరోపించారు.
అధికార
పార్టీ
సాగిస్తున్న
హింసాకాండ
మొన్నటి
స్థానిక
సంస్థల
ఎన్నికల్లో
పతాక
స్థాయికి
చేరిందని
కాంగ్రెస్
సభ్యుడు
రఘవీరారెడ్డి
ఆరోపించారు..
సోమవారం నాడుఅసెంబ్లీలో 304 నిబంధన కింద ఈ అంశాన్ని లేవనెత్తిన రఘవీర్రెడ్డి గంటసేపు ప్రసంగించారు. ఈ హత్యలపై న్యాయవిచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని తుడిచిపెట్టే లక్ష్యంతో తెలుగుదేశం హింసాకాండను అమలుచేస్తున్నట్టుగా కనిపిస్తున్నదని ఆయన ఆరోపించారు. 18 మంది కాంగ్రెస్ నేతలను గత ఎన్నికల సమయంలో హతమార్చారని ఆయన చెప్పారు. ఆవేశంతో కొనసాగిన రఘవీరారెడ్డి ప్రసంగాన్ని అడ్డుకునేందుకు అధికార పార్టీ సభ్యులు పదేపదే ప్రయత్నించినప్పటికీ ఆయన తన ప్రసంగాన్ని కొనసాగించారు.
రాష్ట్రంలో
ప్రజాస్వామ్యాన్ని
తన
చేతలతో
అధికార
పార్టీ
పాతరేస్తున్నదని
రఘవీరారెడ్డి
అన్నారు.
ప్రభుత్వానికి
నిజంగా
చిత్తశుద్దివుంటే
ఎన్నికల
సందర్భంగా
జరిగిన
హత్యలపై
న్యాయవిచారణకు
ఆదేశించాలని
ఆయన
డిమాండ్
చేశారు.విపక్ష
పార్టీల
తరఫున
గెలిచిన
ఎంపిటిసిలను
ఎంపిపిలను
ప్రలోభపెట్టేందుకు
హోంమంత్రి
దేవేందర్గౌడ్,
ముఖ్యమంత్రి
చంద్రబాబు
నాయుడు
ప్రయత్నిస్తున్నారంటూ
రఘవీరారెడ్డి
చేసిన
వ్యాఖ్యలు
మాత్రం
సభలో
తీవ్ర
గందరగోళం
సృష్టించారు.
రఘవీరారెడ్డి
ఆరోపణలను
హోం
మంత్రి
దేవేందర్
గౌడ్
తీవ్రంగా
ఖండించారు.
తెలుగుదేశం,
బిజెపి
కూడా
ఈఅంశంపై
మాట్లాడేందుకు
పట్టుబట్టడంతో
చర్చను
మంగళవారం
నాటికిస్పీకర్
వాయిదా
వేశారు