కాందహార్ చేరుకున్న ఐఎస్ఐ ఛీఫ్
కాందహార్: అంతర్జాతీయ తీవ్రవాది ఒసామాబిన్ లాడెన్ను అప్పగించాలని అప్ఘనిస్తాన్ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు పాకిస్థాన్ ఇంటర్సర్వీస్ ఇంటలిజెన్స్ (ఐఎస్ఐ) ఛీఫ్ మహమూద్ అహ్మద్ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల బృందం కాందహార్ చేరుకుంది.
సీనియర్ మిలటరీ ఇంటలిజెన్స్ అధిపతులు, విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారులు తాలిబన్ విదేశాంగ మంత్రి వకీల్ అహ్మద్ ముట్టవకీల్ను కలుసుకున్నారు. లాడెన్ను ప్రపంచానికిఅప్పగించేందుకు ఈ బృందం తాలిబన్కు మూడు రోజుల గడువు ఇవ్వవచ్చునని భావిస్తున్నారు.
ఒక వ్యక్తి కోసం 25 మిలియన్ల మంది ప్రాణాలను ఫణంగాపెట్టవద్దని చెబుతూ లాడెన్ను అప్పగించాలని తాలిబన్పై పాకిస్థాన్ ఒత్తిడి తెస్తోంది. బృందాన్ని పంపడం ఇందులో చివరి యత్నంగా ఇస్లామాబాద్ పత్రికలురాశాయి.
మహమూద్ తాలిబన్ దేశాధినేత ముల్లా మహమ్మద్ ఉమర్ను కూడా కలుసుకోవచ్చునని భావిస్తున్నారు. లాడెన్నుఅప్పగించాలని అమెరికా పెట్టిన డిమాండ్పై చర్చించేందుకు ఉమర్ సోమవారంనాడు ఇస్లామిక్ మతపెద్దల సమావేశం ఏర్పాటు చేశారు. అమెరికాపైజిహాద్కు (పవిత్ర యుద్ధానికి) ముల్లా ఉమర్ ముస్లింలకు ఫత్వా జారీ చేసే అవకాశాలున్నాయి.
- పలుదేశాల్లో నిందితులు: బుష్
- బంగ్లా సహకారం కోరిన అమెరికా
- పాక్ను వదిలేందుకు దౌత్యవేత్తల పరుగులు
-
సిక్కులపై
బ్రిటన్లోనూ
దాడులు