వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సమరసన్నాహాల్లోతాలిబన్లు

By Staff
|
Google Oneindia TeluguNews

కాబూల్‌ః ఒసామాబిన్‌ లాడెన్‌ను అప్పగించాలన్న అమెరికా డిమాండ్‌పై సామరస్యంగా స్పందిస్తున్నట్టుగా కనిపిస్తూనే మరో వైపుపెద్దఎత్తున యుద్ధ సన్నాహాల్లో తాలిబన్లు పడ్డారు.

లాడెన్‌ అప్పగింతపై తాలిబన్‌ నేతలు ఏర్పాటు చేసిన ఉలేమాల సమావేశం బుధవారం నాటికి వాయిదా పడింది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో వున్న ఉలేమాలు కాబూల్‌కు చేరుకోవడానికి సమయం పడుతుందనిఅందువల్లనే సమావేశాన్ని వాయిదా వేసినట్టుగా తాలిబన్‌ నేతలు ప్రకటించారు. మరోవైపు లాడెన్‌నుఅప్పగించాలంటే తాము మూడు షరతులు విధిస్తున్నట్టుగా ప్రకటించారు. తమకు ఆర్ధిక సాయాన్నిపెంచాలని, ప్రత్యర్దులకు సాయం నిలిపివేయాలని వారు డిమాండ్‌ చేశారు. ఈ షరతులు విధిస్తూనే దేశంలో ముందుజాగ్రత్త చర్యగా ఎమర్జెన్సీ ప్రకటించారు. 20 వేల మందిసైనికులకు తోడుగా విద్యార్ధులు, యువకులు అంతా ఆయుధాలు పట్టుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. గతంలో సోవియట్‌సైన్యం నుంచి స్వాధీనం చేసుకున్న అత్యాధునిక ఆయుధాలను ఉపయోగించడానికి తాలిబన్లు సన్నాహాం చేస్తున్నారు. మరో వైపు అమెరికా కూడా తమ డిమాండ్‌పైఅఎn్గాన్‌ స్పందన గురించి పట్టించుకోకుండా పెద్ద ఎత్తున సమర సన్నాహాల్లో మునిగింది.అఎn్గాన్‌లో యుద్ధ భయం వల్ల ప్రజలు పాకిస్తాన్‌, ఇరాన్‌ సరిహద్దుల దిశగా పారిపోతున్నారు. ఆయా దేశాలసేనలు వారిని సరిహద్దుల్లోనే నిలవరిస్తున్నాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X