లాడెన్ శవాన్నైనా తెస్తాం: బుష్
వాషింగ్టన్: అంతర్జాతీయ తీవ్రవాది ఒసామాబిన్ లాడెన్ను సజీవంగానో, నిర్జీవంగానో పట్టుకోవాలని అమెరికా భావిస్తోందని అధ్యక్షుడు జార్జి బుష్ ప్రకటించారు. లాడెన్కు ఆశ్రయం ఇచ్చినందుకు తాలిబన్ ఫలితం అనుభవించాల్సి వుంటుందని ఆయన అన్నారు.పెంటగాన్ వద్ద ఆయన విలేకరులతో మాట్లాడారు. లాడెన్ శవాన్ని కళ్ల చూడాలనుకుంటున్నారా అని అడిగితే నాకు కావాల్సింది న్యాయం. వాంటెడ్: డెడ్ ఆర్ ఎలైవ్(సజీవంగానో, నిర్జీవంగానో కావాలి) అని గతంలో పశ్చిమ దేశాల్లో పోస్టర్లు కనిపించేవి కదా! అని ఆయన అన్నారు.
తీవ్రవాదంపై
సుదీర్ఘ
పోరాటానికి
అమెరికా
సిద్ధమవుతోందని,
తమ
తక్షణ
లక్ష్యంబిన్
లాడెన్ను
పట్టుకోవడమని
బుష్
అన్నారు.
అమెరికాపై
దాడి
చేసిన
పాపాత్ములను
పట్టుకుంటామని,
తీవ్రవాదులకు
ఆశ్రయమిచ్చినవారిని,
ఇవ్వగలమని
తలపోస్తున్నవారిని,
వారిని
పోషిస్తున్నవారిని
కూడా
ఇందుకు
బాధ్యులను
చేస్తామని,
తన
ప్రకటనను
తాలిబాన్లుసీరియస్గా
తీసుకోవాలని
ఆయన
హెచ్చరించారు.
యుద్ధం
వస్తే
ప్రాణ
నష్టం
సంభవిస్తుందనేవిషయాన్ని
ఆయన
అంగీకరించారు.
కొంత
మూల్యం
చెల్లించక
తప్పదు.
మాసైనిక
బలగాలకు
ఈ
విషయం
తెలుసు.
రక్షణ
మంత్రికీ
తెలుసు
అని
ఆయన
అన్నారు.
ఉగ్రవాదుల
వల్ల
జరిగిన
నష్టం
నుంచి
అమెరికా
ఆర్థిక
వ్యవస్థ
గట్టెక్కుతుందన్నవిశ్వాసాన్ని
బుష్
వ్యక్తం
చేశారు.
అవసరమైతే
ఆర్థిక
వ్యవస్థ
పునరుత్తేజానికి
ఒక
ప్యాకేజీని
ప్రకటించేవిషయమై
కాంగ్రెస్తో
చర్చిస్తానని
ఆయన
చెప్పారు.
- పలు దేశాల్లో నిందితులు: బుష్
- బంగ్లా సహకారం కోరిన అమెరికా
- పాక్ను వదిలేందుకు దౌత్యవేత్తల పరుగులు
-
సిక్కులపై
బ్రిటన్లోనూ
దాడులు