వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
కోమాలో కోట్ల విజయభాస్కర్ రెడ్డి
హైదరాబాద్: మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్సీనియర్ నాయకుడు కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఆరోగ్యం క్షీణించినట్లుసమాచారం.ఆరోగ్యం విషమించడంతో కోట్ల విజయభాస్కర రెడ్డినిఅపోలో ఆస్పత్రిలోని ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో చేర్చారు.పరిస్థితి విషమించడంతో ఆయన్ను వెంటిలేటర్పై వుంచినట్టుగా డాక్టర్లు చెప్పారు.మంగళవారం ఉదయం ఎనిమిది గంటల ప్రాంతంలో ఆయన కోమాలోకి వెళ్లారు. ఆయన ఊపిరితిత్తుల, కాలేయ, మూత్ర సంబంధ వ్యాధులతో బాధపడుతున్నారు.
ఆయన ఇటీవలే తన 83వ జన్మదినాన్ని జరుపుకున్నారు. తన 83వ జన్మదినాన్ని జరుపుకున్న మర్నాడే ఆరోగ్యం క్షీణించడంతో ఆయన ఆస్పత్రిలోచేరారు.
ఇటీవలకాంగ్రెస్
అధ్యక్షురాలు
సోనియాగాంధీ
హైదరాబాద్వచ్చి
ఆయనను
ఆస్పత్రిలో
పరామర్శించారు.కోట్లవిజయభాస్కరరెడ్డి
రెండు
సార్లు
ఆంధ్రప్రదేశ్
ముఖ్యమంత్రిగా,
మూడు
సార్లు
కేంద్ర
మంత్రిగా
పని
చేశారు.
Comments
Story first published: Tuesday, September 18, 2001, 23:53 [IST]