వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కోట్లకు ప్రముఖుల పరామర్శ

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌ః సీనియర్‌ కాంగ్రెస్‌ నేత కోట్ల విజయభాస్కర్‌రెడ్డి ఆరోగ్య పరిస్థితి విషమించినట్టుగా తెలియడంతో పెద్దసంఖ్యలో సీనియర్‌ కాంగ్రెస్‌ నేతలు, ఆయన అభిమానులు, అధికార ప్రముఖులు మంగళవారం నాడు ఆస్పత్రికి వెళ్లి కోట్ల ఆరోగ్య పరిస్థితి గురించి ఆయన కుటుంబ సభ్యులు, వైద్యులను అడిగి తెలుసుకున్నారు.

మాజీ ప్రధాని పివి నరసింహారావు తనసీనియర్‌ సహచరున్ని పరామర్శించారు. మాజీ ముఖ్యమంత్రులు నేదురుమల్లి జనార్ధనరెడ్డి, నాదెండ్ల భాస్కర్‌రావు, సిఎల్‌పి నేత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి, పిసిసి అధ్యక్షుడు సత్యనారాయణరావు, పలువురు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలుఅపోలోకు వెళ్లి కోట్లను పరామర్శించారు. మంగళవారం సాయంత్రం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఆస్పత్రికి వెళ్లి కోట్ల ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర మంత్రులు పుష్పలీల,అరుణ హోం మంత్రి దేవేందర్‌గౌడ్‌ కూడా అపోలోకు వెళ్లారు. కోట్ల అభిమానులు బంధుమిత్రులు, కాంగ్రెస్‌ నేతలుపెద్ద సంఖ్యలో అపోలో అస్పత్రివద్ద వున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X