నందనవనంపై ఎమ్మెల్యేలవిచారణ
హైదరాబాద్: హైదరాబాద్లోని మూసీ నదిని సుందరమయం చేయడానికి చేపట్టిన నందనవనం ప్రాజెక్టుపై జంటనగరాల శాసనసభ్యులతోవిచారణ జరిపించేందుకు ప్రభుత్వం అంగీకరించింది. నందనవనం ప్రాజెక్టు అమలులో అవకతవకలు జరిగాయని కాంగ్రెస్, బిజెపి సభ్యులు మంగళవారం శాసనసభలో ప్రభుత్వ దృష్టికి తెచ్చారు. నందనం ప్రాజెక్టు అమలుపై జరిగిన అవకతవకలమీద విచారణకు సభా సంఘం వేయాలని ప్రతిపక్షాలు చేసిన డిమాండ్ను ప్రభుత్వం త్రోసిపుచ్చింది.
ప్రాజెక్టు అమలుకు విడుదల చేసిన 3.5 కోట్ల రూపాయలలో ఒక్కపైసా కూడా సద్వినియోగం కాలేదని, పనులు జరగకుండానే బిల్లును చెల్లించారని ప్రతిపక్షాలువిమర్శించాయి. ఇందుకు బాధ్యులైన అప్పటి హైదరాబాద్ జిల్లా కలెక్టర్ భన్వర్లాల్పై, ఇతర అధికారులపై చర్యలు తీసుకోవానలి ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి.
కాగ్నా
జలాల
తరలింపు
యోచన
లేదు
రంగారెడ్డి
జిల్లాలోని
వికారాబాద్లో
గల
కాగ్నా
నదీ
జలాలను
హైదరాబాద్,
సికింద్రాబాద్
ప్రజల
మంచినీటి
అవసరాలకు
తరలించే
ఆలోచన
లేదని
ప్రభుత్వం
మంగళవారం
స్పష్టం
చేసింది.
కాగ్నా
నదీ
జలాల
తరలింపు
గురించి
నిపుణుల
కమిటీ
సలహా
ఇవ్వలేదని
భారీ
నీటి
పారుదల
శాఖ
మంత్రి
మండవ
వేంకటేశ్వరరావు
చెప్పారు.
కాగ్నా
నదీ
జలాలను
తరలించే
పని
భారీ
ఖర్చుతో
కూడుకున్నదని
ఆయన
అన్నారు.
5.5
శతకోటి
ఘనపుటడుగుల
(టిఎంసిల)
నీటిని
జంటనగరాల
మంచినీటి
అవసరాల
కోసం
వాడుకోవడానికి
అవకాశం
వున్నదని,
ఈ
నది
హైదరాబాద్కు
వంద
కిలోమీటర్ల
దూరంలో
మాత్రమే
ఉన్నదని
బిజెపి
సభ్యుడు
డాక్టర్
కె.
లక్ష్మణ్
అన్నారు.