వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
దేశవ్యాప్తంగా సంఘీభావ దినం
న్యూఢిల్లీః అమెరికాలో టెర్రరిస్టుల దాడుల్లో అసువులు బాసిన వారి ఆత్మశాంతికోసం భారత్ మంగళవారం నాడు జాతీయ సంఘీభావ దినం పాటించింది. దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన నగరాలు పట్టణాల్లో ఉదయం 10.30 గంటలకు ట్రాఫిక్ను నిలిపివేసి రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు.
ప్రధాని నివాసంలో జరిగిన ప్రత్యేక సమావేశం టెర్రరిస్టుల దుశ్చర్యలను తీవ్రంగా ఖండించింది. టెర్రరిజాన్ని కూకటివేళ్లతో సహా నిర్మూలించాల్సిన అవసరం వున్నదని ప్రధాని వాజ్పేయి అన్నారు. టెర్రరిజం పోరులో అమెరికాకు భారత్ బాసటగా వుంటుందని ప్రకటించారు. కాగా వేరొక సమావేశంలో ఢిల్లీలో అమెరికా రాయబారి బ్లాక్విల్ మాట్లాడుతూ, యావత్ప్రపంచం ఒక్కటై టెర్రరిజంపై పోరు జరపాలని పిలుపునిచ్చారు. ఇండియాగేట్ వద్ద వేలాది మందివిద్యార్ధులు అమెరికా మృతులకు నివాళులర్పించారు.
Story first published: Tuesday, September 18, 2001, 23:53 [IST]