వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చావనైనా చస్తాం: తాలిబాన్‌

By Staff
|
Google Oneindia TeluguNews

ఇస్లామాబాద్‌: అంతర్జాతీయ తీవ్రవాది ఒసామాబిన్‌ లాడెన్‌ అప్పగింతకు తాలిబాన్‌ను ఒప్పించేందుకు పాకిస్థాన్‌ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. అమెరికాలోని దాడుల్లో లాడెన్‌ పాత్రకు సంబంధించి తగిన సాక్ష్యాధారాలు చూపితే తప్ప అతడ్నిఅప్పగించే ప్రసక్తి లేదని తాలిబాన్‌ స్పష్టం చేసింది. అమెరికా తమపై యుద్ధానికి వస్తే తుదిశ్వాస వరకు పోరాడుతామని ప్రకటించింది. చర్చల ఫలితాలు ఏమిటనేది అధికారికంగా తెలియరాలేదు.

లాడెన్‌ అప్పగింతపై తుది నిర్ణయం తీసుకునేందుకు తాలిబాన్‌ అధినేత ముల్లా ఉమర్‌మంగళవారం అన్ని రాష్ట్రాల ఉలేమాలతో ఒక సమావేశం ఏర్పాటు చేశారు. లాడెన్‌విషయంలో వారే ఒక ఫత్వా జారీ చేస్తారని ఆయన పాక్‌ బృందానికి తెలియజేశారు. దీంతో పాకిస్థాన్‌ బృందం తన పర్యటనను మరో రోజు పొడిగించుకుంది. పాక్‌ బృందంముల్లా ఉమర్‌తోను, ఇతర నాయకులతోను మూడు గంటల పాటు చర్చలు జరిపింది. పాకిస్థాన్‌ అధ్యక్షుడుపర్వేజ్‌ ముషారఫ్‌ సందేశాన్ని బృందం వారికి అందజేసింది. అమెరికాలోని దాడులకుఅఫ్ఘనిస్థాన్‌లోనే కుట్ర జరిగినట్లు సాక్ష్యాధారాలున్నాయని, సమయంమించిపోతోందని, ఈ సమస్యను తక్షణమే పరిష్కరించాలని పాక్‌ బృందం తాలిబాన్‌ విదేశాంగ మంత్రికి చెప్పింది.

  • పలు దేశాల్లో నిందితులు: బుష్‌
  • బంగ్లా సహకారం కోరిన అమెరికా
  • పాక్‌ను వదిలేందుకు దౌత్యవేత్తల పరుగులు
  • సిక్కులపై బ్రిటన్‌లోనూ దాడులు
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X