వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాంగ్రెస్‌పై బాబు ధ్వజం

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: శాసనసభా సమావేశాలను కాంగ్రెస్‌ రాజకీయ లబ్దికోసం, ప్రచారం కోసం వాడుకుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడువిమర్శించారు. ఆయన బుధవారం తెలుగుదేశం శాసనసభా పక్షం సమావేశంలో ప్రసంగించారు. ప్రజా సమస్యలు సభలో చర్చకు వచ్చిన ప్రతిసారీ వాటిని జటిలం చేసిందని ఆయన అన్నారు. ప్రజా సమస్య పరిష్కారం పట్ల కాంగ్రెస్‌కు చిత్తశుద్ధి లేదని ఆ పార్టీ శాసనసభలో వ్యవహరించిన తీరే స్పష్టం చేసిందని ఆయన అన్నారు. ప్రజా సమస్యల పట్ల బాధ్యతారహితంగా వ్యవహరించిందని ఆయన అన్నారు. కరువు పరిస్థితులను కూడా కాంగ్రెస్‌ రాజకీయం చేసిందని ఆయన అన్నారు. సమస్యలపై చర్చించకుండా కాంగ్రెస్‌ వాకౌట్‌ చేసిందని ఆయన అన్నారు.

భారత ఆహార సంస్థ (ఎఫ్‌సిఐ) గోదాములపై సిపిఎం దాడులు చేయడాన్ని ఆయన ఆక్షేపించారు. గోదాములపై దాడులకు పూనుకోవడం అన్యాయమని ఆయన అన్నారు. కరువు ప్రాంతాల్లోఅందరికీ పని కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ఆయన చెప్పారు. పంచాయతీ స్థాయి నుంచి ప్రజా ప్రతినిధులకు భాగస్వామ్యం కల్పిస్తున్నామని ఆయన చెప్పారు.
ఉయ్యూరు, సిద్ధిపేట ఉప ఎన్నికల పోలింగ్‌ సందర్భంగా చోటు చేసుకున్న సంఘటనలపై కూడా సమావేశంలో చర్చించారు. సిద్ధిపేటలో తమ పార్టీ నేతలు డబ్బులు పంచిన సంఘటనపై కూడా చర్చ జరిగింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X