గోదావరి జలాలపైఅసెంబ్లీలో రభస
హైదరాబాద్: గోదావరి జాలాల వినియోగంపైవివాదం చెలరేగడంతో శుక్రవారం శాసనసభలో తీవ్ర గందరగోళానికి దారి తీసింది. భారీ నీటి పారుదల శాఖ మంత్రి మండవ వేంకటేశ్వరరావు ఇచ్చిన సమాధానంతో సంతృప్తి చెందని కాంగ్రెస్ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. గోదావరి జలాల వినియోగంపై 304వ నిబంధన కింద చర్చ జరిగింది. గోదావరి జలాల వినియోగానికి చేపట్టిన పథకాలకు కేటాయించిన నిధులపైవివరణ ఇవ్వాలని కాంగ్రెస్ సభ్యులు పట్టుబట్టారు. ప్రాజెక్టు నివేదికలు రాకుండా తానువివరాలు ఇవ్వలేనని మంత్రి వెంకటేశ్వరరావు చెప్పారు.
ఈ సమయంలో గోదావరి జలాల వినియోగంపై చర్చ ముగించి వేరేఅంశాన్ని చేపట్టడానికి అధ్యక్ష స్థానంలోని ప్యానెల్స్పీకర్ ప్రయత్నించారు. దీంతో ఆగ్రహం చెందిన కాంగ్రెస్ సభ్యులుస్పీకర్ పోడియం వద్దకు వెళ్లి ప్యానెల్ స్పీకర్తో వాగ్వివాదానికి దిగారు. ఈ సమయంలో మాట్లాడేందుకు అన్ని పక్షాలకు ప్యానెల్స్పీకర్ అనుమతించారు. గోదావరి నదిపై చేపట్టిన ప్రాజెక్టులను నాలుగైదేళ్లలో పూర్తి చేస్తామని మంత్రి వెంకటేశ్వరరావు చెప్పారు. అయితేబడ్జెట్ కేటాయింపుల వివరాలు కావాలని కాంగ్రెస్ సభ్యులు పట్టుబట్టారు. దీనికి మంత్రి నుంచి సంతృప్తికరమైన సమాధానం రాకపోవడంతో తాము సభ నుంచి వాకౌట్ చేస్తున్నట్లు ప్రతిపక్ష నాయకుడు డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి ప్రకటించారు.