జయలలితకు సుప్రీం ఉద్వాసన
చెన్నయ్ః
మూడేళ్ళు
జైలు
శిక్ష
పడిన
జయలలిత
తమిళనాడు
ముఖ్యమంత్రిగా
కొనసాగరాదని
సుప్రీంకోర్టు
సంచలనాత్మక
తీర్పు
ఇచ్చింది.
టాన్సీ
కేసులో
మూడేళ్ళు
జైలుశిక్ష
పడిన
జయలలిత
మరో
క్షణం
కూడా
ముఖ్యమంత్రి
పదవిలో
కొనసాగే
వీలు
లేదని
సుప్రీంకోర్టు
ఐదుగురు
న్యాయమూర్తుల
ధర్మాసనం
ఏకగ్రీవంగా
తీర్పు
చెప్పింది.
రాజ్యాంగంలోని
164
సెక్షన్
ప్రకారం
జయనియామకం
చెల్లనేరదని
న్యాయమూర్తులు
తీర్పు
చెప్పారు.
శాసనసభా పక్ష నేతగా ఎన్నికైనంత మాత్రాన శిక్ష పడిన జయలలితను ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకరం చేయమని ఆహ్వానించిన అప్పటి గవర్నర్ ఫాతీమా బీని కూడా సుప్రీంకోర్టు తప్పు పట్టింది. జస్టిస్ బరుచా సారధ్యంలో ఐదుగురు సభ్యులుగల సుప్రీంకోర్టు ధర్మానసం శుక్రవారం నాడు ఈ సంచలనాత్మక తీర్పు వెలువరించింది.
ఐదుగురు
సభ్యులు
వున్న
సుప్రీంకోర్టు
ధర్మాసనంలో
ముగ్గురు
సభ్యులు
ఒక
నివేదికను,
ఇద్దరు
సభ్యులు
మరో
నివేదికను
ఇచ్చారు.
అయితే
ఐదుగురు
న్యాయమూర్తులు
జయలలిత
పదవిలో
కొనసాగరాదనే
స్పష్టం
చేశారు.
సుప్రీంకోర్టు
తీర్పు
దరిమిలా
జయలలిత
ముఖ్యమంత్రి
పదవి
నుంచి
తప్పుకోవాల్సి
వుంటుంది.
రెండు
కేసుల్లో
నాలుగేళ్ళ
జైలు
శిక్ష
పడినందువల్ల
ఎన్నికల్లో
పోటీ
చేసేందుకు
అనర్హురాలైన
జయలలిత
సానుభూతితో
అన్నా
డిఎంకెకు
ఘనవిజయం
చేకూర్చిపెట్టారు.
శాసనసభా పక్ష నేతగా ఎన్నికైన వ్యక్తి ఎవరైనా వారికే పట్టం కట్టాలనే రాజ్యాంగ సూత్రం ప్రకారంఅప్పటి గవర్నర్ ఫాతిమా బీవి జయలలితను ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిందిగా ఆహ్వానించారు. ఫాతిమా బీవి నిర్ణయంవివాదాస్పదంగా మారింది. మొత్తం మీద జయలలిత అధికారపీఠం మీద కూర్చున్నారు. గద్దెనెక్కిన నెలరోజుల్లోగా మాజీ ముఖ్యమంత్రి కరుణానిధిని అర్థరాత్రిఅరెస్టు చేయడం, కేంద్ర మంత్రుల్ని పోలీస్టేషన్ పాలు చేసిన సంఘటన దేశవ్యాప్తంగా కలవరం సృష్టించింది. కేంద్రంతో లడాయిపెట్టుకున్న జయలలిత ఆ తరువాత కాస్త దారికి వచ్చారు. అయితే సుప్రీంకోర్టు జయలలిత నియామకం చెల్లనేరదంటూ తీర్పు ఇవ్వడంతో ఆమెకు కోలుకోలేని దెబ్బతగిలినట్లయింది.