మళ్ళీ సి.ఎం. అవుతా-జయ శపథం
చెన్నయ్ః న్యాయస్థానంలో నా నిజాయితీ నిరూపించుకుంటా... మళ్ళీ తమిళనాడు ముఖ్యమంత్రి నవుతానని అన్నాడిఎంకె అధినేత్రి జయలలిత అన్నారు. సుప్రీంకోర్టు సంచలన తీర్పుతో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన అనంతరం ఆమెవిలేకరులతో మాట్లాడుతూ ఈ సారి ఎన్నికల్లో గెలిచి ముఖ్యమంత్రి స్థానం చేజిక్కించుకుంటానని చెప్పారు.
కేసులు ఎదుర్కొంటాను.... వాటిలోవిజయం సాధిస్తాను... ఉపఎన్నికల్లో విజయం సాధించి మళ్ళీ ముఖ్యమంత్రి నవుతాననివిషణ్ణవదనంతో జయలలిత చెప్పారు. ఎటువంటి విధ్వంసానికి పాల్పడకుండా సంయమనం పాటించాల్సిందిగా ఆమె తన పార్టీ కార్యకర్తలకు హితవు పలికారు. కేంద్రంలోని ఎన్.డి.ఎ. ప్రభుత్వం రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపుతప్పాయనే నెపంతో తమిళనాడు ప్రభుత్వాన్ని కూల్చేందుకు సిద్ధంగా వున్నదని, డిఎంకె నేత కరుణానిధి తిరిగి గద్దెనెక్కేందుకు గద్దలా ఎదురు చూస్తున్నారని, ఈ తరుణంలో కార్యకర్తలు సంయమనం పాటించాలని ఆమె అన్నారు.
జయనియామకం చెల్లదన్న సుప్రీం