తమిళనాడు సిఎంగాసెల్వమ్
చెన్నై: తమిళనాడు నూతన ముఖ్యమంత్రిగా ఒ. పన్నీర్సెల్వమ్ శుక్రవారం సాయంత్రం ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ రంగరాజన్ ఆయన చేత రాజభవన్లో ప్రమాణం చేయించారు. అంతకు ముందు అన్నాడియంకె శాసనసభా పక్షం సమావేశమైసెల్వమ్ను తమ నేతగా ఎన్నుకుంది. ఆయన జయలలిత మంత్రివర్గంలో రెవెన్యూ మంత్రిగా పని చేశారు.
సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ముఖ్యమంత్రి పదవికి జయలలిత రాజీనామా చేసిన తర్వాత నూతన ముఖ్యమంత్రిగాసెల్వమ్ ప్రమాణ స్వీకారం చేశారు. అయితే ఇది తాత్కాలిక ఏర్పాటు మాత్రమేనని జయలలిత అన్నారు. తాను నిర్దోషిగా బయట పడుతానని, ఆ తర్వాత తిరిగి ముఖ్యమంత్రి పదవిని అధిష్ఠిస్తానని ఆమె ధీమా వ్యక్తం చేశారు. అన్నాడియంకె పాలన కొనసాగుతుందని,అందువల్ల సుప్రీం కోర్టు తీర్పును పెద్దగా లెక్కలోకి తీసుకోవాల్సిన అవసరం లేదని అన్నాడియంకె భావిస్తోంది.
ఇటీవలి ఎన్నికల్లో సెల్వమ్ పెరియాకులం నియోజకవర్గం నుంచి శాసనసభకు ఎన్నికయ్యారు.సెల్వమ్ జయలలిత, శశికళల కుటుంబాలకు అత్యంత సన్నిహితుడని చెప్తారు.
జయనియామకం చెల్లదన్న సుప్రీం