వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ముంచుకొస్తున్న యుద్ధమేఘాలు

By Staff
|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్‌: అమెరికా, తాలిబాన్‌లు యుద్ధానికి సిద్ధమవుతున్నాయి. అంతర్జాతీయ తీవ్రవాది ఒసామాబిన్‌ లాడెన్‌ను తక్షణమే బేషరతుగా అప్పగించాలని అమెరికా అధ్యక్షుడు బుష్‌ డిమాండ్‌ చేశారు.అందుకు తాలిబాన్‌ అంగీకరించలేదు. అమెరికా దాడులకు పూనుకుంటే పవిత్ర యుద్ధానికి దిగక తప్పదని పాకిస్థాన్‌లోని అమెరికా రాయబారి సలాం జయీన్‌ అన్నారు. తానేమి చేయాలనేది ఒసామాబిన్‌ లాడెన్‌ ఇష్టాయిష్టాలకే వదిలేస్తున్నామని ఆయన చెప్పారు. దాంతో అమెరికా సంతృప్తి చెందకపోతేజిహాద్‌ తప్పదని ఆయన చెప్పారు. పాకిస్థాన్‌ తమకు సహకరించగలదని తాలిబాన్‌ భావిస్తోంది. అయితే, పాకిస్థాన్‌ తాలిబాన్‌పై తన ఒత్తిడిని మరింతపెంచింది. అఎ్ఘాన్‌ ప్రజల క్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని తాలిబాన్‌ వ్యవహరించాలని పాక్‌ కోరింది.

లాడెన్‌ను అప్పగించకపోతే లక్షలాది మంది ప్రజలు నిష్కారణంగా ప్రాణాలు కోల్పోతారని హెచ్చరించింది.అఎn్ఘాన్‌ మాత్రం యుద్ధానికి సన్నాహాలు చేసుకుంటోంది. సరిహద్దుల్లో,పర్వత శ్రేణులపై సైన్యాన్ని మోహరించింది. ఇదిలా వుంటే, అమెరికా ఎయిర్‌ఫోర్స్‌విమానాలు, యుద్ధ నౌకలను వివిధ ప్రాంతాల్లో మోహరించింది.

లాడెన్‌ను తక్షణమే అప్పగించాలనే డిమాండ్‌తో బుష్‌ మరిన్ని డిమాండ్లు కూడా తాలిబాన్‌ ముందుపెట్టారు. టెర్రిరిస్టు శిక్షణా శిబిరాలను వెంటనే మూసేయాలని, ప్రతి టెర్రిరిస్టును తమకుఅప్పగించాలని, టెర్రరిస్టు శిబిరాలకు తమకు మార్గం సుగమం చేయాలని,అఎn్ఘాన్‌లో వున్న అన్ని దేశాల ఖైదీలను విడుదల చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X