ముషారఫ్పై మండిపడిన వాజ్పేయి
న్యూఢిల్లీః
అఎn్గాన్
వ్యవహారంలో
భారత్పై
తీవ్రమైన
నిందలు
వేసిన
పాకిస్తాన్
అధినేత
జనరల్
ముషారఫ్పై
ప్రధాని
వాజ్పేయి
తీవ్ర
ఆగ్రహం
వ్యక్తం
చేశారు.
సమీపభవిష్యత్తులో
తాను
పాకిస్తాన్లో
అడుగుపెట్టేది
లేదని
ఆయన
ప్రకటించారు.
అఎn్గాన్ వ్యవహారంలో కలగజేసుకుంటూ పాకిస్తాన్-అమెరికాల మధ్య చిచ్చుపెట్టేందుకు భారత్ ప్రయత్నిస్తున్నదని తమ దేశ ప్రజలను ఉద్దేశించి చేసిన ప్రసంగంలో ముషారఫ్ ఆరోపించారు. అఎn్గానిస్తాన్కు దూరంగా వుండాలని భారత్ను ఆయన హెచ్చరించారు. అఎn్గానిస్తాన్లోని తాలిబన్లకు, పాకిస్తాన్కు వ్యతిరేకంగా పోరాడుతున్న నార్తర్న్ అలయెన్స్కు దన్నుగా నిలబడాలనే ఉబలాటం భారత్లో కనిపిస్తున్నదని ఆయన ఆరోపించారు. టెర్రరిజాన్ని పెంచి పోషిస్తూ కాశ్మీర్లో చిచ్చుకు కారణమైన పాకిస్తాన్ ఉల్టా తమపైనే నిందలు వేయడాన్ని వాజ్పేయి తీవ్రంగా ఖండించారు. కాశ్మీర్ ఉగ్రవాదం పాకిస్తాన్ పుణ్యమే అన్ని ఎన్నిసార్లు చెప్పినా చెవికెక్కించుకోని అమెరికాపై కూడా వాజ్పేయి అక్కసు వెళ్లగక్కారు. ముషారఫ్ ప్రసంగం భారత్-పాకిస్తాన్ సంబంధాలను తీవ్రంగా దెబ్బతీస్తాయని వాజ్పేయి వ్యాఖ్యానించారు.
తానుగానీ విదేశాంగ మంత్రి జస్వంత్సింగ్గానీ ఇప్పట్లో పాక్లో అడుగుపెట్టే సమస్యే లేదని ఆయన చెప్పారు. అఎn్గానిస్తాన్ రోగ లక్షణం మాత్రమేనని మొత్తం రోగాన్ని నయం చేస్తే తప్ప టెర్రరిస్టుల పీడ ప్రపంచానికి వదలదని ఆయన చెప్పారు.
ఇదిలా వుండగా కాంగ్రెస్, బిజెపి కూడా ముషారఫ్ ధోరణిని తీవ్రంగా విమర్శించాయి. తీవ్రవాదాన్ని పెంచిపోషిస్తున్న ముషారఫ్ భారత్ను తప్పుపట్టడాన్ని కాంగ్రెస్ ప్రతినిధి ఆస్కార్ ఫెర్నాండెజ్, బిజెపి అధ్యక్షుడు జనా కృష్ణమూర్తి తీవ్రంగా ఖండించారు. అమెరికాకు లాడెన్ను అఎn్గాన్ అప్పగించడం అనుమానమేనని, లాడెన్ తమ దేశంలో లేడని అఎn్గాన్ ప్రకటించినా ప్రకటించే అవకాశం వున్నదని కృష్ణమూర్తి అన్నారు.