వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆంధ్ర చెస్‌ బాలయోధుల దుర్మరణం

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌ః ఆంధ్రప్రదేశ్‌కు చెందిన చెస్‌ వర్ధమాన తారలు ఆయిదుగురు ఒరిస్సాలో జరిగిన ఒక రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. ఆసియా అండర్‌-10 చెస్‌ ఛాంపియన్‌ దాసరి మీను(ఒంగోలు), మాజీ చాంపియన్‌ మేకల అభినవ్‌ (నల్గొండ) హరిచరణ్‌ ( ప్రకాశం), శేఖర్‌, ఎనిమిదేళ్ల మాధురి(హైదరాబాద్‌) వున్నారు. మాధురి మినహా మిగిన వారంతా పదిపదకోండేళ్ల ప్రాయంలో వున్నారు.

ఈ ప్రమాదంలో ఈ ఆటగాళ్ల గురువు పిడిఎస్‌ గిరినాధ్‌, ఆయన భార్య జయలక్ష్మి, శ్రీవాణి(20), శివచైతన్య(18) తీవ్రంగా గాయపడ్డారు. శ్రీవాణి, శివచైతన్యఅక్కా తమ్ముళ్లు. ఒరిస్సా రాజధాని భువనేశ్వర్‌కు 40 కిలోమీటర్ల దూరంలో మధ్యాహ్నం ఈ ప్రమాదం జరిగింది. పూరీలో సోమవారం నుంచి ప్రారంభమవుతున్న టోర్నీలో పాల్గొనేందుకువీరంతా హైదరాబాద్‌ నుంచి బయలుదేరి వెళ్లారు.రైలులో జట్ని వరకు అక్కడినుంచి టాటా సుమోలో పూరీ వెళ్లుతుండగా ఎదురుగా వస్తున్న ప్రైవేట్‌ బస్సు ఢీకొన్నట్టుగా తెలిసింది. ప్రమాదంవిషయం తెలిసిన రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర దిగ్భ్రాంతి ప్రకటించింది.మృతదేహాలను తరలించడానికి ప్రత్యేకవిమానాన్ని ఏర్పాటు చేస్తున్నట్టుగా ప్రకటించింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X