ఫలక్నుమాలోక్రీడాకారుల భౌతికకాయాలు
హైదరాబాద్: రోడ్డు ప్రమాదంలో మరణించిన యువచెస్ క్రీడాకారుల మృతదేహాలను మంగళవారం హైదరాబాద్కు తెస్తున్నారు. క్షతగాత్రులను కూడా హైదరాబాద్కు తరలిస్తున్నారు. ఫలక్నుమాఎక్స్ప్రెస్లో ఒక ప్రత్యేక బోగీలో క్రీడాకారుల భౌతిక కాయాలను హైదరాబాద్కు తరలించిస్వస్థలాలకు చేరవేస్తారు. ఇందుకుగాను హైదరాబాద్లోని స్పోర్ట్స్ అథారిటీ అధికారుల బృందం భువనేశ్వర్ వెళ్లింది.భువనేశ్వర్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆదివారంనాడుఅయిదుగురు చెస్ క్రీడాకారులు మృతి చెందినవిషయం తెలిసిందే. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి ఆందోళనకరంగా వున్నట్లు సమాచారం.
క్రీడాకారుల మృతి పట్ల ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వారి మృతికి ఆయన సంతాపం వ్యక్తం చేశారు. మరణించినవారి కుటుంబాలకు రెండు లక్షల రూపాయలేసిఎక్స్గ్రేషియాను ఆయన తిరుపతిలో ప్రకటించారు. గాయపడినవారికి ప్రభుత్వ ఖర్చులతో చికిత్స చేయిస్తామని ఆయన చెప్పారు. మరణించిన క్రీడాకారులపేర్ల మీద చెస్ టోర్నమెంట్ నిర్వహిస్తామని ఆయన చెప్పారు.
క్రీడాకారుల మృతితో ఆంధ్రప్రదేశ్ క్రీడారంగంలోవిషాద ఛాయలు అలుముకున్నాయి. ప్రపంచ చెస్ ఛాంపియన్విశ్వనాథన్ ఆనంద్ హైదరాబాద్లో ఒక ప్రయివేట్ సంస్థ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలోపి. హరికృష్ణ, కోనేరు హంపి పాల్గొనాల్సి వుండింది. అయితే కోనేరు హంపి ఈ కార్యక్రమానికిహాజరు కాలేదు. ఈ కార్యక్రమం అతి నిరాడంబరంగా జరిగింది. మరణించిన క్రీడాకారులకువిశ్వనాథన్ ఆనంద్ తీవ్ర సంతాపం ప్రకటించారు.