కాశ్మీర్ హింస మరింత తీవ్రం
న్యూఢిల్లీః రానున్న రోజుల్లో జమ్మూ కాశ్మీర్లో హింసాకాండ భారీ ఎత్తున చెలరేగే అవకాశం వున్నదని కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి ఒమర్ అబ్దుల్లా అనుమానం వ్యక్తం చేశారు.
అమెరికాకు పాకిస్తాన్ మద్దతు నివ్వడం పట్ల గుర్రుగా వున్న పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థలు తమ ప్రతాపాన్ని కాశ్మీర్లో చూపే అవకాశం వున్నదని ఆయన అన్నారు. పాకిస్తాన్ కూడా వారి దృష్టిని అమెరికాపై నుంచి మళ్లించేందుకు ఈ హింసాకాండకు మరింత ఆజ్యం పోసే అవకాశం వున్నదని ఆయన అన్నారు.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా వున్నాయని ఆయన చెప్పారు.కాశ్మీర్ లోయలోని అఎn్గాన్ తీవ్రవాదులు, మరికొన్ని సంస్థలకు చెందిన తీవ్రవాదులు అమెరికాతో పోరాడేందుకుఅఎn్గానిస్తాన్కు తరలి వెళ్లిన కారణంగా రానున్న రోజుల్లో కాశ్మీర్ హింసాకాండ మందగించే అవకాశం వున్నదంటూ విదేశాంగ మంత్రి జస్వంత్ సింగ్ చేసిన ప్రకటనకు ఒమర్ ప్రకటనకు పొంతన లేకపోవడం గమనార్హం.