దత్తాత్రేయకు నరేంద్ర సవాల్
హైదరాబాద్: దమ్ము, ధైర్యం వుంటే పార్లమెంటు సభ్యత్వానికి రాజీనామా చేసి తనపై సికింద్రాబాద్ లోక్సభ స్థానం పోటీ చేయాలని తెలంగాణ రాష్ట్ర సమితి (టిఎస్ఎస్) కన్వీనర్ ఎ. నరేంద్ర కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి బండారు దత్తాత్రేయను సవాల్ చేశారు. తెలంగాణ రాష్ట్ర సమితి నేతకె. చంద్రశేఖర్ రావు సానుభూతి ఓట్లతోనే గెల్చారని, తెలంగాణసెంటిమెంటు పని చేయలేదని బండారు దత్తాత్రేయ చేసిన ప్రకటనకు స్పందిస్తూ సోమవారంవిలేకరుల సమావేశంలో నరేంద్ర ఆ సవాల్ విసిరారు.
తెలంగాణ ప్రభావం లేదని భావిస్తే తన సవాల్కు దత్తాత్రేయ ప్రతిస్పందించాలని ఆయన అన్నారు. దత్తాత్రేయ సికింద్రాబాద్ లోక్సభ స్థానానికి రాజీనామా చేసి మళ్లీ పోటీ చేయాలి. ఆయనపై సానుభూతి వుంటుంది. నేను మెదక్ స్థానానికి రాజీనామా చేసి దత్తాత్రేయపై తెలంగాణ వాదంమీద పోటీ చేస్తాను. ఆయన సానుభూతి గెలుస్తుందో, నా తెలంగాణ వాదం గెలుస్తుందో తేల్చుకోవాలి అని నరేంద్ర అన్నారు.
ప్రజలు తెలంగాణకు అనుకూలంగా వున్నారో లేరోసర్వే నిర్వహించి తేల్చుకోవాలని ఆయన ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడును డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటువిషయంలో రాష్ట్ర బిజెపి నాయకత్వం కేంద్ర నాయకత్వాన్ని తప్పు దోవ పట్టిస్తోందని ఆయనవిమర్శించారు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమం ఊపందుకుంటున్నవిషయాన్ని చంద్రశేఖర్ రావు విజయం తెలియజేస్తోందని బిజెపి కేంద్ర నాయకుడు మల్హోత్రా ప్రకటించడం పట్ల ఆయన హర్ష వ్యక్తం చేశారు.
తెలగాణ సాధన సమితి రాష్ట్ర స్టీరింగ్ కమిటీని, జిల్లా కన్వీనర్లను మంగళవారం నియమిస్తారు. తాను లోక్సభ సభ్యత్వానికి రాజీనామా చేసేవిషయాన్ని మంగళవారం జరిగే కార్యకర్తల సమావేశంలో నిర్ణయించుకుంటానని నరేంద్ర చెప్పారు.