వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టెర్రరిస్టు క్యాంపులను మూసేస్తున్న పాక్‌

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: అమెరికా ఒత్తిడి పెరగడంతో పాకిస్థాన్‌ ఆక్రమిత కాశ్మీర్‌లోని, ఇతర ప్రాంతాల్లోని తీవ్రవాద శిబిరాలను మూసేసే ప్రక్రియను పాకిస్థాన్‌ ప్రారంభించింది.అఎn్ఘానిస్తాన్‌కు తరలిపోవాల్సిందిగా మిలిటెంట్లను ఆదేశించింది. పాకిస్థాన్‌సైన్యం, భద్రతా సంస్థలు చేసిన ఈ వైర్‌లెస్‌ సూచనలతోమిలిటెంట్లలో అయోమయం చోటు చేసుకుంది.

ప్రస్తుతం మిలిటెంట్లు పాకిస్థాన్‌ ఆక్రమిత కాశ్మీర్‌ నుంచి తరలిపోతున్నారని, అయితే దీని ప్రభావం కనిపించడానికి ఇంకా సమయం పడుతుందని అధికారులంటున్నారు.మిలిటెంట్లు పెద్ద యెత్తున తరలిపోతున్న జాడలేవీ కనిపంచడం లేదని వారంటున్నారు.

పాక్‌ ఆక్రమిత కాశ్మీర్‌ నుంచి తరలిపోతున్న మిలిటెంట్లను పాకిస్థాన్‌సైన్యం ఎస్కార్ట్‌ ద్వారా అఎ్ఘానిస్థాన్‌కు పంపుతోంది.
పాక్‌ ఆక్రమిత కాశ్మీర్‌లో గానీ, ఇతర ప్రాంతాల్లో గానీ టెర్రరిస్టు శిబిరాలు వుండకూడదని అమెరికా నుంచి తీవ్రమైన ఒత్తిడి వస్తోంది. పాకిస్థాన్‌ భూభాగంమీద టెర్రరిస్టు శిబిరాలు వుండడానికి వీల్లేదని అమెరికాఅంటోంది.

టెర్రరిస్టు గ్రూప్‌లను మొదట పాకిస్థాన్‌ భారత్‌లోని జమ్మూ కాశ్మీర్‌లోకి ప్రవేశపెట్టే ప్రయత్నం చేసిందని, మన బలగాలు అప్రమత్తంగా వుండి సరిహద్దులను మూసి వేయడంతో అది సాధ్యం కాలేదని భారత అధికార వర్గాలు చెప్పాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X