వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నలుగురు దోపిడీ దొంగల కాల్చివేత

By Staff
|
Google Oneindia TeluguNews

సిద్ధిపేట: మెదక్‌ జిల్లాలో పోలీసులు నలుగురు బస్సు దోపిడీ దొంగలను కాల్చి చంపారు. మెదక్‌ జిల్లా చిన్నకోడూరు మండలం మల్లారం గ్రామం వద్ద రాజీవ్‌ రహదారిపై ఆదివారం రాత్రి ఈ సంఘటన జరిగింది. హైదరాబాద్‌ నుంచి కరీంనగర్‌ జిల్లా జగిత్యాలకు వెళ్తున్న రోడ్డు రవాణా సంస్థ(ఆర్టీసి) బస్సును ఏడుగురు దోపిడీ దొంగలు ఆపి, ప్రయాణికులను దోచుకున్నారు.

ప్రయాణికుల నుంచి నగదును, బంగారు ఆభరణాలను దోచుకుంటున్న సమయంలోపెట్రోలింగ్‌లో వున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఇది గమనించిన దోపిడి దొంగలు పోలీసులపై కత్తులతో దాడి చేశారు. వారిని ప్రతిఘటించడానికి పోలీసులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో నలుగురు మరణించారు. మరో ముగ్గురు పారిపోయారు. వేలిముద్రలు, ఇతర పద్ధతుల ద్వారా దోపిడీ దొంగలను గుర్తించడానికి ప్రయత్నిస్తున్నామని జిల్లా పోలీసు సూపరింటిండెట్‌
చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X