వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సమితి గ్రీన్‌సిగ్నల్‌ అవసరం లేదు

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూయార్క్‌ః టెర్రరిజం పై తాము ఎక్కుపెట్టిన యుద్ధానికి ఐక్యరాజ్యసమితి ఆమోద ముద్ర అవసరం లేదని అమెరికా ప్రకటించింది. అఎn్గాన్‌పై దాడికి సన్నాహాలు పూర్తి చేసిన అమెరికా ఈ విషయంలో కొన్ని దేశాల నుంచి వ్యక్తమవుతున్న అనుమానాలకు తెరదించే ప్రయత్నాలు ప్రారంభించింది.

పశ్చిమ రాజ్యాలన్నీ బేషరతుగా అమెరికాకు అండగా వున్నప్పటికీ చైనా వంటి ఒకటి రెండు దేశాలు ఐక్యరాజ్యసమితి అనుమతి లేకుండా దాడులు ప్రారంభించరాదని సూచిస్తున్నవిషయం విదితమే. ఇలాంటి దేశాలను సైతం బుజ్జగించి దారికి తెచ్చుకోవడానికి అమెరికా ప్రయత్నిస్తున్నది. అధ్యక్షుడు జార్జ్‌బుష్‌ కాంప్‌డేవిడ్‌లోసీనియర్‌ సైనిక కమాండర్‌లతో యుద్ధతంత్రాన్ని ఖరారు చేసిన తర్వాత వైట్‌హౌస్‌కు తిరిగివచ్చారు. ఆయన చేసైగ చేయడమే ఆలస్యం అమెరికా బలగాలు విరుచుకుపడటం ఖాయమనిఅంటున్నారు.

పనిలోపనిగాఇరాక్‌పై కూడా దాడులు సాగే అవకాశం వున్నదని చెబుతున్నారు. టెర్రరిజంపై తాము ఎక్కుపెట్టిన పోరు లాడెన్‌కు మాత్రమే పరిమితం కాదని లాడెన్‌ పట్టుబడినా తమదాడుల్లో హతుడైనా యుద్ధం మాత్రం ఆగదని అమెరికా ప్రకటించింది. ప్రపంచ ప్రజల శాంతియుత మనుగడకు సవాలుగా మారిన టెర్రరిజాన్ని కూకటివేళ్లతో నిర్మూలించాలన్నదే అమెరికా ధ్యేయమని అమెరికా ప్రతినిధి కొలెన్‌పావెల్‌ ప్రకటించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X