వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
బాంబు భయంతోరైళ్ల నిలిపివేత
న్యూఢిల్లీ: బాంబు భయంతో ఢిల్లీకి చెందిన రాజధానిఎక్స్ప్రెస్, బొంబాయికి చెందిన ఆగస్టు క్రాంతిఎక్స్ప్రెస్ మంగళవారం దాదాపు రెండు గంటల పాటు నిలిచిపోయాయి.
బొంబాయి నుంచి బయలుదేరినరైలులో బాంబు పెట్టినట్లు సమాచారం అందిందని ఢిల్లీ పోలీసులు ఉదయం ఎనిమిదిన్నర గంటల ప్రాంతంలో చెప్పారు. దీంతో రెండురైళ్లను షొలాఖ, జగన్పట్టి స్టేషన్లలో నిలిపేశారు. షొలాఖా ఫరీదాబాద్, మథురల మధ్య, జగన్పట్టి భరత్పూర్, మథురల మధ్య వుంటాయి.ప్రయాణిలందరినీ దించేసి రైళ్లలో సోదా చేశారు. బాంబుపెట్టినట్లు అందిన సమాచారం వట్టిదేనని తేలడంతోరైళ్లను పంపించారు.
Comments
Story first published: Tuesday, September 25, 2001, 23:53 [IST]