వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చెస్‌ క్రీడాకారుల అంత్యక్రియలు

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌:ఒరిస్సా రోడ్డు ప్రమాదంలో మరణించిన ఐదుగురుచెస్‌ క్రీడాకారుల భౌతిక కాయాలకు వారి వారి స్వస్థలాల్లో మంగళవారం అంత్యక్రియలు జరిగాయి. వారి మృతదేహాలను మంగళవారం ఫలక్‌నుమాఎక్స్‌ప్రెస్‌లో రాష్ట్రానికి తరలించారు. మేకల అభినవ్‌ మృతదేహాన్నివిజయవాడలో దించి అక్కడి నుంచి నల్లగొండ జిల్లాలోని కోదాడకు తరలించారు.

హరిచరణ్‌,మీనుల మృతదేహాలను గుంటూరులో దింపి అక్కడి నుంచి ప్రకాశం జిల్లా ఒంగోలుకు తరలించారు. హేమ మాధురి, శేఖర్‌ల మృతదేహాలను ఫలక్‌నుమాఎక్స్‌ప్రెస్‌లో తెచ్చారు. శేఖర్‌ మృతదేహాన్ని అతనిస్వస్థలం కరీంనగర్‌ జిల్లాలోని గోదావరిఖనికి తరలించారు.వీరిద్దరి మృతదేహాలను సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో దించుతున్నప్పుడు అధికారుల్లో, అభిమానుల్లో, బంధువుల్లోవిషాద ఛాయలు అలుముకున్నాయి.

చిన్నారి చెస్‌ క్రీడాకారుల మృతి రాష్ట్ర క్రీడలకు తీరనిలోటని రాష్ట్ర క్రీడల మంత్రి తమ్మినేని సీతారాం అన్నారు. నిర్మాణంలో వున్న స్టేడియాలకు ఈ చిన్నారుల పేర్లు పెడుతామని ఆయన చెప్పారు. వీరి పేర జాతీయ, అంతర్జాతీయ టోర్నమెంట్లు నిర్వహిస్తామని ఆయన చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X