అమెరికాకు, మిత్రులకు పాక్ హెచ్చరిక
ఇస్లామాబాద్:అఎn్ఘానిస్థాన్లో
మరో
ప్రభుత్వ
ఏర్పాటుకు
సహకరిస్తే
భారీ
మూల్యం
చెల్లించాల్సి
వుంటుందని
పాకిస్థాన్
అమెరికా,
తదితర
దేశాలను
హెచ్చరించింది.అఎn్ఘాన్లో
నార్తర్న్
అలయెన్స్ను
గానీ,
మాజీ
రాజు
జాహీర్
షాను
గానీ
అధికారంలోకూర్చోబెట్టాలని
ప్రయత్నిస్తే
తీవ్ర
పరిణామాలు
ఎదుర్కోవాల్సి
వుంటుందని
పాకిస్థాన్
అన్నది.అఎn్ఘాన్లోని
కొన్ని
గ్రూపులు
విదేశీ
సాయాన్ని
కోరుతున్నాయని,అఎn్ఘాన్లో
ఎటు
వైపు
విదేశీ
సాయం
అందించినా
మంచిది
కాదని
పాక్
విదేశాంగ
మంత్రి
అబ్దుల్
సత్తార్
అన్నారు.
విదేశీ
మద్దతుతో
ప్రభుత్వం
ఏర్పాటు
చేయాలనుకుంటే
ఆ
ప్రయత్నం
విఫలమవుతుందని
ఆయన
అన్నారు.
ఇదిలా
వుంటే,
టెర్రరిస్టులపై
దాడికి
సహకరిస్తున్న
పాకిస్థాన్కు
భారీ
ఆర్థిక
సాయం
చేయడానికి
యూరోపియన్
యూనియన్
ముందుకు
వచ్చింది.
యూరోపియన్
యూనియన్
ప్రతినిధులు
మంగళవారం
పాకిస్థాన్
ప్రతినిధులతో
చర్చలు
జరిపారు.
పాకిస్థాన్కు
అత్యవసర
సాయం
కింద
20మిలియన్ల
యూరోలు
ఇవ్వడానికి
యూరోపియన్
యూనియన్
సమ్మతి
తెలియజేసింది.
తాలిబాన్ నుంచి తాము పలు ప్రాంతాలను స్వాధీనం చేసుకున్నామని, తాలిబాన్సేనలతో తాము యుద్ధం చేస్తున్నామని తాలిబాన్ ప్రత్యర్థులు ప్రకటించుకున్నారు. అమెరికాసేనలు మోహరించిన ఉజ్బెకిస్థాన్ సరిహద్దుల్లో, రష్యాసేనలు మోహరించిన తజకిస్థాన్ సరిహద్దులో తాము యుద్ధం చేస్తున్నామని ప్రత్యర్థులు చెప్పుకున్నారు. తమసేనలు పలు గ్రామాలను స్వాధీనం చేసుకుని ఆసంగ్ చరక్ జిల్లా తూర్పు దిశలో సాగుతున్నాయని ప్రత్యర్థుల అధికార ప్రతినిధి మహమ్మద్ అష్రాఫ్ నదీం చెప్పారు.
ఒసామా
బిన్
లాడెన్,
తదితర
తీవ్రవాదుల
ఆస్తులను
ఫ్రాన్స్
జప్తు
చేసింది.
ఇది
వరకే
చైనా,
జపాన్,
తదితర
దేశాలు
లాడెన్,
ఇతర
తీవ్రవాదుల
ఆస్తులను
జప్తు
చేశాయి.