వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పాక్‌తో చర్చలు సిద్ధమే: వాజ్‌పేయి

By Staff
|
Google Oneindia TeluguNews

మధుర: దక్షిణాసియా ప్రాంతంలో యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న ప్రస్తుత తరుణంలో జాగరూకతతో వ్యవహరించి ఐకమత్యంగా జాతీయ ప్రయోజనాలకు విఘాతం కలిగించే శక్తుల నుంచి రక్షించుకోవాలని ప్రధాని అటల్‌బిహారీ వాజ్‌పేయి ప్రజలకు పిలుపునిచ్చారు. దేశం క్లిష్ట పరిస్థితుల్లో వుందని, ఈ స్థితిలో ఐకమత్యంగా వుండి శాంతి సామరస్యాలు వెల్లివిరిసేలా భద్రతా దళాలు తమ బాధ్యతలను సమర్థంగా నిర్వర్తించేలా ప్రజలు సహకరించాలని ఆయన అన్నారు.

ఆయన పది వేల కోట్ల రూపాయల సంపూర్ణ రోజ్‌గార్‌ యోజనను ఇక్కడ మంగళవారం ప్రారంభించారు. భారత్‌ పాకిస్థాన్‌తో చర్చలకు సిద్ధంగా వుందని, అయితే పాక్‌ జమ్మూ కాశ్మీర్‌లో సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడం మానుకోవాలని ఆయన అన్నారు. భద్రతా దళాలు అప్రమత్తంగా వున్నాయని, ప్రస్తుత స్థితి నుంచి బయట పడగలమనేవిశ్వాసాన్ని ఇస్తున్నాయని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X