వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తాలిబన్లతో సౌదీ తెగతెంపులు

By Staff
|
Google Oneindia TeluguNews

ఇస్లామాబాద్‌ః అఎn్గానిస్తాన్‌లోని తాలిబన్‌ ప్రభుత్వంతో అన్ని రకాల సంబంధాలను తెంచివేసుకుంటున్నట్టుగా సౌదీ అరేబియా ప్రభుత్వం ప్రకటించింది. ప్రపంచం ఇప్పటివరకు తాలిబన్‌ ప్రభుత్వాన్ని అధికారికంగా గుర్తించిన దేశాలు మూడే మూడు. వాటిలో యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ ఇప్పటికే తాలిబన్లతో అన్ని రకాల సంబంధాలను తెంచివేసుకుంటున్నట్టుగా ప్రకటించింది.

ఇప్పుడు సౌదీ కూడా అదే బాట పట్టడంతో ఇక కేవలం పాకిస్తాన్‌ ఒక్కటి మాత్రమే తాలిబన్లతో అధికారికంగా సంబంధాలను కొనసాగిస్తున్న దేశాల జాబితాలో వుంది. పాకిస్తాన్‌కు తాలిబన్లకు మధ్య కూడా దూరం పెరుగుతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. అమెరికాపై దాడులకు కారకునిగా భావిస్తున్న అంతర్జాతీయ ఉగ్రవాది ఒసామాబిన్‌ లాడెన్‌కు అఎn్గాన్‌లోని తాలిబన్‌ ప్రభుత్వం ఆశ్రయం ఇస్తున్నదని అమెరికా సహా పశ్చిమదేశాలు ఆరోపిస్తున్నవిషయం విదితమే.

లాడెన్‌ అప్పగింతకుఅఎn్గాన్‌పై వత్తిడికి అమెరికా చేస్తున్న ప్రయత్నాలు ఇంతవరకు ఫలించలేదు.పైగా అమెరికా సమరసన్నాహాలను సవాలు చేస్తూ యుద్ధానికి తాము కూడా సిద్ధమేనంటూ తాలిబన్లు ఎదురు ప్రకటనలు చేస్తున్నారు. పాకిస్తాన్‌ కూడా తాలిబన్‌ సర్కార్‌తో సంబంధాలు తెంచుకునే ప్రయత్నంలో వున్నదని అయితే అమెరికానే వారించిందని తెలిసింది. తాలిబన్లతో అవసరమైన సందర్భంలో మాట్లాడేందుకు కనీసం ఒక్కదేశమైనాఅందుబాటులో వుండాలన్న ఉద్దేశ్యంతో అమెరికా
ఈ నిర్ణయం తీసుకున్నదని అంటున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X