వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బుష్‌ హత్యకు లాడెన్‌ కుట్ర!!

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూయార్క్‌ః అమెరికా అధ్యక్షుడు జార్జ్‌ బుష్‌ హత్యకు అంతర్జాతీయ ఉగ్రవాది ఒసామాబిన్‌ లాడెన్‌ గతంలోనే కుట్రపన్నినట్టుగా వెల్లడయింది. ఇటలీలో గత జులైలో జరిగిన జి-8 దేశాల సదస్సు సందర్భంగా అమెరికా అధ్యక్షుడు జార్జ్‌ బుష్‌తో పాటు ఎనిమిది సంపన్న రాజ్యాల నేతలను మట్టుపెట్టేందుకు ఒసామాబిన్‌ లాడెన్‌ కుట్రపన్నినట్టుగా న్యూయార్క్‌ టైమ్స్‌ వెల్లడించింది.

ఈజిప్ట్‌ అధ్యక్షుడు హోస్నీ ముబారక్‌, ఇటలీ ఉప ప్రధాని గియాన్‌ ఫ్రాంకోఫినిలను ఉటంకిస్తూ ఈ మేరకు ఆ పత్రిక ఒక కథనాన్ని ప్రకటించింది. జి-8 దేశాల నేతలు సమావేశమైన భవనంపై దాడివిమానంతో దాడి చేయాలని లాడెన్‌ కుట్ర పన్నినట్టుగా తమకువిశ్వసనీయంగా తెలిసిందని ఫ్రెంచి టెలివిజన్‌ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈజిప్ట్‌ అధ్యక్షుడు హోస్నిముబారక్‌ చెప్పారు. తమ దేశ గూఢచార విభాగంఅందించిన ఈ సమాచారాన్ని తాము అమెరికా చెవిన కూడా వేశామని ఆయన చెప్పారు. ఇటలీ ప్రధాని గియానో ఫ్రాంకో ఫినీ కూడా ఒక టెలివిజన్‌ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అమెరికాపై దాడులకు తీవ్రవాదులు కుట్రపన్నినట్టుగా తమకు తెలిసిందని చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X