బుష్ హత్యకు లాడెన్ కుట్ర!!
న్యూయార్క్ః అమెరికా అధ్యక్షుడు జార్జ్ బుష్ హత్యకు అంతర్జాతీయ ఉగ్రవాది ఒసామాబిన్ లాడెన్ గతంలోనే కుట్రపన్నినట్టుగా వెల్లడయింది. ఇటలీలో గత జులైలో జరిగిన జి-8 దేశాల సదస్సు సందర్భంగా అమెరికా అధ్యక్షుడు జార్జ్ బుష్తో పాటు ఎనిమిది సంపన్న రాజ్యాల నేతలను మట్టుపెట్టేందుకు ఒసామాబిన్ లాడెన్ కుట్రపన్నినట్టుగా న్యూయార్క్ టైమ్స్ వెల్లడించింది.
ఈజిప్ట్
అధ్యక్షుడు
హోస్నీ
ముబారక్,
ఇటలీ
ఉప
ప్రధాని
గియాన్
ఫ్రాంకోఫినిలను
ఉటంకిస్తూ
ఈ
మేరకు
ఆ
పత్రిక
ఒక
కథనాన్ని
ప్రకటించింది.
జి-8
దేశాల
నేతలు
సమావేశమైన
భవనంపై
దాడివిమానంతో
దాడి
చేయాలని
లాడెన్
కుట్ర
పన్నినట్టుగా
తమకువిశ్వసనీయంగా
తెలిసిందని
ఫ్రెంచి
టెలివిజన్
ఛానెల్కు
ఇచ్చిన
ఇంటర్వ్యూలో
ఈజిప్ట్
అధ్యక్షుడు
హోస్నిముబారక్
చెప్పారు.
తమ
దేశ
గూఢచార
విభాగంఅందించిన
ఈ
సమాచారాన్ని
తాము
అమెరికా
చెవిన
కూడా
వేశామని
ఆయన
చెప్పారు.
ఇటలీ
ప్రధాని
గియానో
ఫ్రాంకో
ఫినీ
కూడా
ఒక
టెలివిజన్
ఛానెల్కు
ఇచ్చిన
ఇంటర్వ్యూలో
అమెరికాపై
దాడులకు
తీవ్రవాదులు
కుట్రపన్నినట్టుగా
తమకు
తెలిసిందని
చెప్పారు.