వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అవినీతి కేసుల్లోస్టేలు కూడదు

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీః అవినీతి కేసుల్లో హైకోర్టులు యధాలాపంగా స్టేలు మంజూరు చేయడాన్ని సుప్రీంకోర్టు తీవ్రంగా తప్పుబట్టింది. అవినీతి నిరోధక చట్టం కింద నమోదైన ఏ కేసులోనూ కింది కోర్టులు తాత్కాలికంగానైనా స్టేలు మంజూరు చేయరాదని జస్టిస్‌ కెటి థామస్‌, జస్టిస్‌ ఎస్‌ఎన్‌ వరియవలతో కూడిన డివిజన్‌ బెంచ్‌ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.

కోర్టులవిచారణలో వున్న ఇలాంటి అవినీతి కేసులు ఎన్నింటిపైస్టే జారీ చేశారో జాబితాను తయారు చేయాల్సిందిగా అన్ని హైకోర్టుల రిజిస్ట్రార్లను సుప్రీం కోర్టు ఆదేశించింది. అవినీతి నిరోధక చట్టం కిందవిచారించే కేసుల్లో స్టేకు అవకాశమే వుండకూడదని జస్టిస్‌ వరియవపేర్కొన్నారు. ఈ విషయంలో పార్లమెంట్‌ విధించిన నిషేధాన్ని కోర్టులుమీరరాదని న్యాయమూర్తులు పేర్కొన్నారు.

రాజస్తాన్‌కు చెందిన సత్యనారాయణ శర్మ అనే వ్యక్తి అవినీతి కేసులోవిచారణపై హైకోర్టు నుంచి స్టే తెచ్చుకుని ఏడేళ్లుగా వాయిదాలపై వాయిదాలతో కేసును నాన్పుతున్న వైనం సుప్రీం కోర్టు దృష్టికి రావడంతో న్యాయమూర్తులు ఈ ఆదేశాలు జారీ చేశారు. దేశంలోని వివిధ కోర్టుల్లో ఇలాంటి పరిస్థితే వున్నట్టుగా తమ దృష్టికి వచ్చిందని వారుపేర్కొన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X