గ్రామాల్లో విద్యుత్తుపై సమావేశాలు
హైదరాబాద్: గ్రామీణవిద్యుత్తు వినియోగదారులతో ప్రతి నెలా అన్ని గ్రామాల్లో వారం రోజుల పాటు సమావేశాలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. మొదటి సమావేశాలుఅక్టోబర్ 5 నుంచి 11 తేదీ వరకు జరుగుతాయనివిద్యుచ్ఛక్తి శాఖ మంత్రి కె. సుబ్బారాయుడు చెప్పారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు శుక్రవారంవిద్యుచ్ఛక్తి మంత్రి, ట్రాన్స్కో ఉన్నతాధికారుల సమావేశంలోవిద్యుచ్ఛక్తి పరిస్థితిని సమీక్షించారు. అన్ని గ్రామాల్లో తమ సిబ్బంది ఈ సమావేశాలు ఏర్పాటు చేసి ప్రజల నుంచి ఫిర్యాదులు, సలహాలు తీసుకుంటారని, వాటిని అక్కడికక్కడే పరిష్కరిస్తారని మంత్రి చెప్పారు.విద్యుత్ వినియోగదారుల సమావేశాలు జిల్లా స్థాయిలో నెలకుఒకసారి, నియోజకవర్గాల స్థాయిలో రెండు నెలలకు ఒకసారి జరుగుతాయని ఆయన చెప్పారు.
కాంపౌండు
ఫీజుపై
మంత్రి
వర్గ
సమావేశంలో
చర్చిస్తామని
ముఖ్యమంత్రి
నారాచంద్రబాబునాయుడు
సమావేశంలో
చెప్పారు.
రాష్ట్రంలో
భారీ
వర్షాలు
కురిసిన
నేపథ్యంలోవిద్యుదుత్పాదన
స్థితిని
కూడా
ఈ
సమావేశంలో
సమీక్షించారు.