వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కోర్టు హాల్‌లో సిఐ కాల్చివేత

By Staff
|
Google Oneindia TeluguNews

విజయనగరం: సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ గాంధీని, అతని గన్‌మన్‌ చిరంజీవిరావును తీవ్రవాదులు శుక్రవారం మధ్యాహ్నం కోర్టు హాల్‌లో కాల్చి చంపారు. ఈ సంఘటన విజయనగరం జిల్లాలోని సాలూరు కోర్టులో జరిగింది. సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ గాంధీ, అతని గన్‌మన్‌ కోర్టు హాల్‌ నుంచి బయటకు వస్తుంటే పీపుల్స్‌వార్‌ తీవ్రవాదులు చాలా దగ్గరి నుంచి కాల్పులు జరిపారు. దీంతో గాంధీ, ఆయన గన్‌మన్‌ చిరంజీవరావు అక్కడికక్కడే కుప్ప కూలారు.

నలుగురు తీవ్రవాదులు లాయర్‌ దుస్తుల్లో మధ్యాహ్నం దాదాపు ఒంటి గంటా 45 నిమిషాల ప్రాంతంలో వచ్చి గాంధీని చంపారని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. ఈ సంఘటన సాలూరు పట్టణంలో తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. ఈ హఠాత్సంఘటనకు కోర్టుహాల్‌ నివ్వెరపోయింది. గాంధీ చాలా కాలంగా పీపుల్స్‌వార్‌ నక్సలైట్ల హిట్‌ లిస్టులో వున్నట్లు చెబుతున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X