కాబూల్ లో యుద్ధఘోష
కాబూల్ః అమెరికా ఏ క్షణంలోఅయినా దాడి చేయవచ్చుననే ఆలోచనల మధ్య ఆఫ్ఘన్ శతఘ్నులు శుక్రవారం తమ శక్తి సామర్ధ్యాలను పరీక్షించుకున్నాయి. ఏ క్షణంలో అమెరికా దాడికి దిగినా ఎదుర్కొనేందుకువీలుగా ఆఫ్ఘన్ లు శుక్రవారం నాడు పరీక్షలు నిర్వహించారు. అయితే ఆఫ్ఘన్ కొండల నుంచి భీకరమైన శబ్దాలనువిన్న ఆఫ్ఘన్ ప్రజలు యుద్ధం వచ్చేసిందని భయపడ్డారు. ఒక్క ఉదుటున వీధుల్లోకి పరుగులు తీశారు.
అయితే ఆ శబ్దాలు శతఘ్నులు, ఇతర ఆయుధాలను పరీక్షించినందువల్ల వచ్చినవి మాత్రమేనని, యుద్ధ ప్రారంభం కాలేదని తెలుసుకున్న ఆఫ్గన్ ప్రజలు హాయిగా ఊపిరిపీల్చుకున్నారు. మరో రెండు వారాలు ఆగితే ఆఫ్గనిస్తాన్ లో ఎముకలుకొరికే చలి వుంటుందని, ఆ వాతావరణంలో తమపై దాడి చేయడం ఆ పైవాడి తరం కూడా కాదని ఆఫ్ఘన్మిలిటెంట్లు ధీమాతో వున్నారు. ఆఫ్ఘనిస్థాన్ కు వున్న అన్ని మార్గాలను మూసివేస్తూ వస్తున్న అమెరికా భవిష్యత్ వ్యూహం ఏమిటనేది వేచి చూడాలి.