వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తన దాకా వస్తే గానీ...: వాజ్‌పేయి

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: తీవ్రవాదం గురించి భారత్‌ ఎన్నిసార్లు చెప్పినా అమెరికా పట్టించుకోలేదని ప్రధాని అటల్‌బిహారీ వాజ్‌పేయి అన్నారు. తన దాకా వస్తే గానీ అమెరికాకు తీవ్రవాదం గురించిఅర్థం కాలేదని ఆయన అన్నారు. ఇస్లాం మత పెద్దలతో ఆయన శుక్రవారం సమావేశమయ్యారు. అమెరికా ఇంతకు ముందే తీవ్రవాదంపై పోరు సాగించాల్సి వుండిందని ఆయన అన్నారు. ప్రపంచం ఇంతకు ముందే తీవ్రవాదాన్నిఅర్థం చేసుకుని వుండాల్సింది ఆయన అభిప్రాయపడ్డారు.

మతం పేరుతో సమాజంలో వైరుధ్యాలు సృష్టించాలని ప్రయత్నిస్తున్నారని ఆయన అన్నారు. భారత్‌ తీవ్రవాదానికి గురయితేఅయిందలెమ్మని ఇంత దాకా అనుకున్నారని, ఇప్పుడు పట్టించుకోవాల్సిన అనివార్యత ఏర్పడిందని ఆయన అన్నారు. మతం రంగు పులిమి తీవ్రవాద చర్యలు సాగుతుండడం పట్ల ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. తమ పోరు తీవ్రవాదంపై మాత్రమే గానీ ఇస్లాంపై కాదని ఆయన అన్నారు. మతంపేరుతో విద్వేషాన్ని రెచ్చగొట్టే శక్తుల పట్ల అప్రమత్తంగా వుండాలని ఆయనకోరారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X