భజరంగ్దళ్ను నిషేధించం: అద్వానీ
న్యూఢిల్లీ: భజరంగ్దళ్పై నిషేధం విధించే ప్రసక్తి లేదని కేంద్ర హోం మంత్రి ఎల్.కె. అద్వానీ స్పష్టం చేశారు. తగిన సాక్ష్యాధారాలు లభించిన తర్వాతనే స్టూడెంట్ ఇస్లామిక్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా(సిమి)పై ప్రభుత్వం నిషేధం విధించిందని ఆయన చెప్పారు.
భజరంగ్దళ్ ఉగ్రవాద చర్యలకు, జాతి వ్యతిరేక చర్యలకు పాల్పుడుతున్నట్లు, బాంబుపేలుళ్లకు, విచ్ఛిన్నకర ఉద్యమాలకు దిగుతున్నట్లు ఎవరు కూడా సాక్ష్యాధారాలతో ముందుకు రాలేదని ఆయన దూరదర్శన్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నారు.
తగిన సాక్ష్యాధారాలు చూపించగలిగే స్థితిలో వున్నప్పుడు మాత్రమే ప్రభుత్వం ఏ సంస్థనైనా నిషేధిస్తుందని, సిమి నిషేధంసెప్టెంబర్ 11వ తేదీ దాడుల తర్వాత సంభవించడం కేవలం యాధృచ్ఛికమేనని ఆయన అన్నారు.
న్యూయార్క్,
వాషింగ్టన్లలో
దాడుల
అనంతరం
అంతర్గత
భద్రతను
పటిష్టం
చేసేవిషయం
గురించి
చర్చించేందుకు
అక్టోబర్
5వ
తేదీన
రాష్ట్రాల
ప్రధాన
కార్యదర్శుల,
పోలీసు
డైరెక్టర్
జనరల్స్
సమావేశం
ఏర్పాటు
చేసినట్లు
ఆయన
తెలిపారు.
ప్రధాని
అటల్బిహారీ
వాజ్పేయి
అన్ని
రాష్ట్రాల
ముఖ్యమంత్రుల
సమావేశం
ఏర్పాటు
చేసే
అవకాశాలు
కూడా
ఉన్నాయని
ఆయన
చెప్పారు.