వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అత్యుత్సాహం ఎందుకు?: కాంగ్రెస్‌

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: అమెరికాకు సహాయం చేయడానికి వాజ్‌పేయి ప్రభుత్వం అత్యుత్సాహం ప్రదర్శిస్తోందని కాంగ్రెస్‌విమర్శించింది. పశ్చిమ దేశాలకు ఇస్లామ్‌కు మధ్య, ఇస్లామ్‌కు ఇతర దేశాలకు మధ్య జరిగే పోరులో పాలు పంచుకునేవిషయంలో భారత్‌ జాగ్రత్తగా వ్యవహరించాలని కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని హెచ్చరించింది.

అమెరికా జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్‌డిఎ) ప్రభుత్వ సహాయాన్ని కోరనే లేదని, విదేశాంగ, రక్షణ శాఖల మంత్రి జస్వంత్‌ సింగ్‌ సహాయం చేస్తామని చెప్పారని అఖిల భారత కాంగ్రెస్‌ కమిటీ (ఎఐసిసి) విదేశీ వ్యవహారాల విభాగం చైర్మన్‌ నట్వర్‌ సింగ్‌ ఆదివారంనాడు విలేకరుల సమావేశంలో అన్నారు.

అమెరికా భారత్‌ సహాయం తీసుకుంటుందని నేను అనుకోను. పాకిస్థాన్‌ భూభాగాన్ని అమెరికా వాడుకుంటుంది. తజికిస్థాన్‌, ఉజ్బెకిస్థాన్‌ల నుంచి దాడులు నిర్వహిస్తుంది.

సౌదీ అరేబియా, ఖాతర్‌, ఒమెన్‌లలో ఇది వరకే అమెరికా స్థావరాలున్నాయి అని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X