హోమ్ పేజి
లక్నో:సీనియర్ కాంగ్రెస్ నాయకుడు మాధవరావు సింధియా ప్రయాణిస్తున్న ఒక ప్రయివేట్విమానం ఢిల్లీ, కాన్పూర్ల మధ్య కూలిపోయింది. ఈ ప్రమాదంలో సింధియా మరణించినట్లు అధికార వర్గాలు చెప్పాయి.
ఈ ప్రయివేట్ విమానంలో మాధవరావు సింధియాతో పాటుమరో ఏడుగురు ప్రయాణిస్తున్నారు. మిగతా ఏడుగురుమరణించినట్లు సమాచారం. ఇందులో నలుగురు జర్నలిస్టులు. దీంతో పత్రికా లోకం కూడా శోకసముద్రంలో మునిగిపోయింది.
విమాన ప్రమాదంలో మరణించిన మాధవరావు సింధియాకు 56 ఏళ్లు. ఆయనకు భార్య, ఒక కుమారుడు, ఒక కూతురు వున్నారు. ఆయన తన 26వ యేటనే లోక్సభకు ఎన్నికయ్యారు. ఆయన కేంద్ర మంత్రిగా కూడా పని చేశారు.
మాధవరావు సింధియా మరణ వార్త తెలిసిన వెంటనే ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి, హోం మంత్రి ఎల్.కె. అద్వానీ, ఎఐసిసి అధ్యక్షురాలు సోనిగాంధీ ఆయన ఇంటికి వెళ్ళారు. దుర్వార్త విన్న వెంటనే మాధవరావు సింధియా ఇంటికి పలువురు రాజకీయ నేతలు, అభిమానులు, కార్యకర్తలు బారులు తీరారు.
ఈ విమానం ఉత్తరప్రదేశ్లోని మైన్పురి జిల్లా భోగావ్ వద్ద కూలిపోయింది.విమానం ఇంజన్కు మంటలు అంటుకోవడంతో ఈ ప్రమాదం సంభవించినట్లు ఎడిజి (శాంతిభద్రతలు)ఎ.కె. మిత్రా విలేకరులకు చెప్పారు.
సింధియా ఆదివారం సాయంత్రం కాన్పూర్లోని ఒక బహిరంగ సభలో ప్రసంగించాల్సి వుంది. ప్రమాదం జరగడంతో బహిరంగ సభ అర్థాంతరంగా ఆగిపోయింది.
ఈ
విమానం
మధ్యాహ్నం
12
గంటల
49
నిమిషాలకు
ఢిల్లీలో
బయలుదేరింది.
కాన్పూర్కు
మధ్యాహ్నం
ఒంటి
గంట
50
నిమిషాలకు
చేరుకోవాలి.
అయితే
ఒంటి
గంటన్నరకు
లక్నోకువిమానం
నుంచి
సంబంధాలు
తెగిపోయాయి.
పదిసీట్లు గల ఈ విమానంలో పైలట్ రే గౌతమ్తో పాటు ఎనిమిది మంది వున్నారు.విమానంలో ప్రయాణిస్తున్నవారిలో రూపిందర్సింగ్, గోపాల్ బిస్త్, అంజు శర్మ, రంజన్ ఝా, వివేక్ గుప్తా, రీతూ మాలిక్, సంజీవ్ సిన్హా వున్నారు. సంజీవ్ సిన్హా ఇండియన్ఎక్స్ప్రెస్ పత్రిక ప్రతినిధి కాగా రంజన్ ఝా ఆజ్ తక్ ప్రతినిధి.
విషయం తెలిసిన వెంటనే లక్నో నుంచి ఉన్నతాధికారులు సంఘటనా స్థలానికి హుటాహుటిన బయలుదేరి వెళ్లారు.విమాన ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు.