వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బావురుమన్న ఆంధ్ర బిజెపి

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌ః మరో మూడేళ్ళ వరకు ప్రత్యేక రాష్ట్రాల ఊసే లేదని గురువారం హైదరాబాద్‌ లో జరిగిన పదాధికారుల సమావేశంలో బిజెపిసీనియర్‌ నేతలు స్పష్టం చేశారు. మెదక్‌ఎం.పి. నరేంద్ర, మరి కొందరు ఎమ్మెల్ల్యేలతో సహా మొత్తం 14 మందిసీనియర్‌ నేతలు ప్రత్యేక తెలంగాణా నినాదంతో పార్టీకి గుడ్‌ బై చెప్పినఅంశం పదాధికారుల సమావేశంలో ప్రధానంగా చర్చకు వచ్చింది. ఎంత మంది పార్టీని విడిచి వెళ్ళినప్పటికీ బిజెపికి ప్రజల్లో ఆదరణ తగ్గదని సమావేశంలో పాల్గొన్న కేంద్ర హోం శాఖ సహాయం మంత్రివిద్యాసాగర్‌ రావు ధీమా వ్యక్తం చేశారు.

అయితే తెలంగాణా వాదం బిజెపి రాష్ట్ర శాఖకుపెనుశాపంగా మారిందని సమావేశంలో పాల్గొన్న ప్రతి ఒక్కరు ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధ్ర ప్రదేశ్‌ లో బిజెపికి తెలంగాణాలోనే గట్టి పట్టు వున్నవిషయం విదితమే. అయితే ప్రత్యేక తెలంగాణా ఉద్యమం పుణ్యమా అని పార్టీ కేడర్‌ పై పట్టు వున్న నేతలంతా బిజెపిని వీడి వెళ్ళిపోవడం పట్ల సమావేశంలో ఆందోళన కొట్టవచ్చినట్లు కనిపించింది. ఇంకా బిజెపినేఅంటిపెట్టుకొని వున్న కొందరు తెలంగాణాకు చెందిన నేతలు ఈ పరిణామాల పట్ల ఆవేదన వ్యక్తం చేశారు.

వారిని సముదాయించేందుకు విద్యాసాగర్‌ రావు నానా తంటాలు పడాల్సి వచ్చింది. 2004 వరకు ప్రత్యేక రాష్ట్రాల ఊసే లేదని పార్టీ అధ్యక్షుడు జానా కృష్ణమూర్తి స్పష్టం చేశారనివిద్యాసాగర్‌ రావు అన్నారు. మరికొందరు తెలంగాణా బిజెపి నేతలు నరేంద్ర పంచన చేరే అవకాశాలున్నాయనే ఊహాగానాలు జోరుగా సాగుతున్న నేపధ్యంలో జరిగిన పదాధికారుల సమావేశం ఆగ్రహంతో వున్న నేతలకు ఏ మాత్రం ఊరట కలిగించలేకపోయిందనే చెప్పాలి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X