వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భారత్‌ కుబ్రిటన్‌ పార్లమెంట్‌ అండ

By Staff
|
Google Oneindia TeluguNews

లండన్‌ః కాశ్మీర్‌అసెంబ్లీపై తీవ్రవాదులు జరిపిన మెరుపుదాడినిబ్రిటన్‌ పార్లమెంటు తీవ్రంగా ఖండించింది. తీవ్రవాదంపైఅంతా ఏకమై పోరాటం జరపాలనడానికి ఈ సంఘటనే నిదర్శనమనిబ్రిటన్‌ ప్రధాని టోనీ బ్లెయిర్‌ గురువారం పార్లమెంటును ఉద్దేశించి చేసిన ప్రసంగంలో అన్నారు. ఉగ్రవాద నిర్మూలనఅంశంలో అమెరికాకు మద్దతు ఇవ్వడానికి గల కారణాలనువివరించేందుకు బ్లెయిర్‌ బ్రిటన్‌ పార్లమెంటును అత్యవసరంగా సమావేశ పరిచారు. ఈ సమావేశంలో ఆయన ఆవేశపూరితంగా ప్రసంగించారు.

ఉగ్రవాదంపై ఎందుకు పోరాటం సాగించాల్సి వచ్చిందోవివరించేందుకు అంతర్జాతీయ పర్యటన ప్రారంభిస్తున్నట్లు బ్లెయిర్‌ వెల్లడించారు. బ్లెయిర్‌ శుక్రవారం నాడు రష్యా ప్రధాని పుతిన్‌ ను కలుసుకుంటారు. శనివారం నాడు పాకిస్తాన్‌ సైన్యాధ్యక్షుడు ముషారఫ్‌ ను కలుసుకొని చర్చలు జరుపుతారు.

ఉగ్రవాదంపై అమెరికా తలపెట్టిన పోరాటానికి అంతర్జాతీయ మద్దతు కూడగట్టేందుకే బ్లెయిర్‌ వివిధ దేశాలు పర్యటిస్తున్నారు. కాశ్మీర్‌ పై తీవ్రవాదులు జరిపిన దాడినిబ్రిటన్‌ పార్లమెంట్‌ ఏక కంఠంతో ఖండించడంవిశేషం.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X