హైజాక్ డ్రామా సుఖాంతం
న్యూఢిల్లీః
దేశ
అగ్రనేతలతో
సహ
అత్యున్నత
స్థాయి
సెక్యురిటీ
దళాలకు
కంటిమీద
కునుకు
లేకుండా
చేసిన
ముంబాయి-ఢిల్లీ
విమానం
అయింది.
బుధవారం
అర్ధరాత్రి
నుంచి
గురువారం
వేకువ
జాము
వరకు
అసలేం
జరిగిందో,
హైజాకర్స్
ఎవరో
అర్ధం
కాకపోవడంతో
బెంబేలెత్తిపోయిన
అధికార
యంత్రాంగం
చివరకు
వ్యవహారం
అదుగో
పులి
అంటే
ఇదిగో
తోక....
అన్న
విషయం
గుర్తించారు.
ె
ముత్తం వ్యవహారంలో ప్రభుత్వం, ప్రభుత్వ యంత్రాంగంఘోరంగా అభాసు పాలయింది. ఈ వ్యవహారానికి సంబంధించినవివరాలు ఈ విధంగా వున్నాయి. బుధవారం రాత్రి 11.30 గంటల సమయంలో ముంబాయి నుంచి ఢిల్లీకి బయలుదేరిన అలయెన్స్ ఎయిర్ బోయింగ్ 737విమానం అహ్మదాబాద్ గగనతలం వున్న సమయంలోవిమానం హైజాక్ అయినట్టుగా ఢిల్లీ విమానశ్రయం అధికారులకు సమాచారం వచ్చింది. క్షణాల్లోవిమానయాన శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రధానికి సమాచారం వెళ్లింది. హోం మంత్రి అద్వానీ సారథ్యంలోక్రైసిస్ మానేజ్మెంట్ గ్రూప్ ఏర్పాటయింది. వివిధ ఇంటలీజెన్స్ సంస్థల అధిపతులు,విమానాయాన శాఖ మంత్రి షానవాజ్ హుస్సెన్, జాతీయ భద్రతా వ్యవహారాల సలహాదారు బ్రిజేష్మిశ్రా, విదేశాంగ శాఖ కార్యదర్శి చోకిలా అయ్యర్ ఇతర ఉన్నతాధికారులు ఉన్నఫళంగా ప్రధాని నివాసానికి చేరుకున్నారు. సరిగ్గా 1.30 నిమిషాలకు హైజాక్అయినట్టుగా చెబుతున్న విమానం ఢిల్లీలో దిగింది. కమెండో ఆపరేషన్కువీలుగా విమానాన్ని విమానాశ్రయంలో మారుమూల ప్రాంతంలో దించారు.విమానాన్ని చుట్టుముట్టిన కమెండోలు ముందుగావిమానం టైర్లలోంచి గాలి తీసివేశారు. వెనువెంటనే మెరుపువేగంతోవిమానంలోకి జొరబడి అక్కడ హైజాకర్లు ఎవరూ లేకపోవడంతో తెల్లమొహం వేశారు. మొత్తానికి మూడు గంటల డ్రామా తర్వాత పాసెంజర్స్అంతా సురక్షితంగా విమానం దిగివచ్చారు. ఈ హైజాక్ డ్రామా కారణంగా ప్రధాని వాజ్పేయి, హోం మంత్రి అద్వానీ రాత్రంతా కంటిమీద కునుకు లేకుండా గడపాల్సివచ్చింది.
ఈ
హైజాక్
డ్రామాకు
కమ్యూనికేషన్
గ్యాప్
కారణమని
అధికారులు
చెబుతున్నారు.విమానం
హైజాక్
అయ్యే
అవకాశం
వున్నట్టుగా
అహ్మదాబాద్
ఎయిర్
ట్రాఫిక్కంట్రోలర్కు
గుర్తు
తెలియని
వ్యక్తులు
ఫోన్
చేసినట్టుగా
తెలిసింది.
ఈ
ఫోన్తో
అప్రమత్తమై
అధికారులు
వెంటనేపైలెట్ను
సంప్రదించారని
తెలిసింది.
అలయెన్స్విమానం
పైలెట్
విమానంలో
హైజాకర్లు
వున్నరన్న
అభిప్రాయంతో
వెంటనే
కాక్పిట్
తలపులు
లాక్
చేసివిమానాన్ని
జాగ్రత్తగా
ఢిల్లీ
విమానాశ్రయంలో
దించారని
అధికారులు
చెప్పారు.