జయ డుమ్మా - న్యాయమూర్తి ఆగ్రహం
చెన్నయ్ః తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితపై ప్రిన్సిపల్సెషన్స్ జడ్జి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. లండన్ హోటల్ కేసువిచారణ జరుగుతుండగా కోర్టుకు హాజరు కావలసిన జయ డుమ్మా కొట్టారు. ఈ కేసుకు సంబంధించి గత నాలుగు సార్లుగా జయ కోర్టుకుహాజరు కావడం లేదు. జయలలితకు కనీసం సమన్లు జారీ చేయడంలో పోలీసు యంత్రాంగంవిఫలం అయిందని న్యాయమూర్తి మండి పడ్డారు.
కేసు దర్యాప్తు కోసం విదేశాలకు వెళ్ళి వస్తారు..... ఛార్జిషీటు దాఖలు చేసేందుకు మెరీనా బీచ్ చుట్టూ చక్కర్లు కొడతారు కానీ జయలలితకు సమన్లు జారీ చేయలేరా? అని న్యాయమూర్తి పోలీసులను నిలదీశారు. పోలీసుల వైఖరికివిసిగిపోయిన న్యాయస్థానం ఈ కేసును సి.బి.ఐ.కి అప్పగించే అవకాశాలున్నాయని భావిస్తున్నారు. జయలలిత మొట్టమొదటి సారిసి.ఎం. గా వున్న సమయంలో లండన్ లో ఓ హోటల్ ను కొనుగోలు చేసి ఆ తరువాత దానినివిక్రయించారు. ఆర్.బి.ఐ., ఫారిన్ ఎక్స్చేంజ్ అధికారుల అనుమతి లేకుండా జయ ఈ వ్యవహారాన్ని నడిపించారు. ఇంతటి కీలకమైన కేసుకు జయ వరుసగా డుమ్మా కొట్టడాన్ని న్యాయస్థానం తీవ్రంగా పరిగణించింది.