వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
సింధియాకు తుదివీడ్కోలు
గ్వాలియర్ః కాంగ్రెస్సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి మాధవరావు సింధియాకు గురువారం మధ్యాహ్నం ఆయనస్వస్థలమైన గ్వాలియర్ లో అంత్యక్రియలు జరిగాయి. లక్షలాది మంది అభిమానుల అశ్రుతర్పణాల మధ్య అధికార లాంఛనాలతో సింధియాకు తుది వీడ్కోలు పలికారు. సింధియా కుమారుడు ఆదిత్య చితికి నిప్పంటించారు.
ప్రధాని అటల్బిహారీ వాజ్ పేయి, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, లోక్ సభస్పీకర్ బాలయోగి తదితర ప్రముఖులు సింధియా అంతిమ యాత్రలో పాల్గొన్నారు.
సింధియా అంతిమ యాత్రలో లక్షలాది మంది అభిమానులు సజల నయనాలతో పాల్గొన్నారు. సింధియా అమర్రహే అనే నినాదాలతో గ్వాలియర్ శోక సముద్రంగా మారిపోయింది.
Comments
Story first published: Thursday, October 4, 2001, 23:53 [IST]