వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నాలుగుగంటలు ఉత్కంఠ

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీః ముంబాయి-ఢిల్లీ విమానం హైజాక్‌ అయిన వార్తను వివిధ టెలీవిజన్‌ చానెల్స్‌ రాత్రికి రాత్రే ప్రసారం చేయడంతో విమానంలో ప్రయాణికుల బంధువులు, మిత్రులు తీవ్ర భయాందోళనలతో విమానాశ్రయానికి పరిగెత్తుకుంటూ వచ్చారు.

విమానాశ్రయంలో వాతావరణం ఒక్కసారిగా ఉద్రిక్తంగా తయారయింది. కమెండోలు, నిఘా సంస్థల సిబ్బంది భద్రతా దళాలుపెద్ద సంఖ్యలో విమానాశ్రయానికి చేరుకున్నారు. పాత్రికేయులు, టీవీ చానెల్స్‌ రిపోర్టర్లు, ఫోటోగ్రాఫర్ల గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. మరో వైపువిమానాశ్రయం నుంచి విమానంలో వున్న వారితో కొందరుసెల్‌ఫోన్‌లో మాట్లాడారు. ఈ సందర్భంగా లోపల వున్నవారుఅంతా ప్రశాంతంగా వున్నదని చెప్పడంతో మరింత అయోమయ వాతావరణం నెలకొన్నది. అనేక రకాల పుకార్లు షికారు చేశాయి.విమానంలో హైజాకర్లు పాసింజర్స్‌లో కలిసిపోయి వున్నారని కొందరు చెప్పగా, మరికొందరు మాత్రం ఇద్దరు పాసింజర్స్‌ ఏదోవిషయంలో గొడవపడ్డారని వారిలో ఒకరు కాక్‌పిట్‌లోకి ప్రవేశించడానికి ప్రయత్నించగా గొడవ ప్రారంభమయిందనిపేర్కొన్నారు. మరికొందరు ఇది మాక్‌ హైజాకింగ్‌ అని, భద్రతా దళాల అప్రమత్తతను పరీక్షించడానికి చేసిన ప్రయత్నం అని అభిప్రాయపడ్డారు.అసలు విషయమేమిటో తెలియక ప్రయాణికులు బంధువులు మాత్రం నానా హైరానా పడ్డారు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X