తాజా దాడుల్లో నలుగురి మృతి
కాందహార్ః అఎn్గాన్ గగనతలంలోకి మంగళవారం ఉదయం డజన్ల సంఖ్యలో అమెరికన్ యుద్ధ విమానాలు ప్రవేశించాయి. ఈ విమానాలు భీకర శబ్దాలతో తొలుత చెక్కర్లు కొట్టి వెళ్లిపోయాయి. ఆ తర్వాత పదిగంటల ప్రాంతంలో మరో విమానం కాందహార్ కాబూల్ నగరాలపై మెరుపువేగంతో వచ్చి బాంబులు గుప్పించి వెళ్లింది. కాందహార్లో నిన్నమొన్నటి వరకు లాడెన్ వున్న ఇల్లు ఈ దాడిలో ధ్వంసమయింది.
లాడెన్, ఉమర్ తమ కుటుంబాలతో సహా ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లిపోయారనిఅంటున్నారు. ఈ దాడుల్లో నలుగురు మరణించినట్టుగా తాలిబన్లు ప్రకటించారు. రెండు రోజుల పాటు చీకట్లోనే దాడులకు పాల్పడిన అమెరికా మంగళవారం నాడు తొలిసారిగా ఉదయం కూడా దాడులకు దిగడం గమనార్హం.విమాన విధ్వంసక క్షిపణులకు చిక్కకుండా తప్పించుకునేందుకు చీకటి మాటున దాడులు జరుపుతున్నారు. అమెరికా యుద్ధవిమానాలను కూల్చడానికి తాలిబన్ సైనికులు శతఘ్నులను ప్రయోగించినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. తాలిబన్లగురికి, లక్ష్యానికి అందనంత ఎత్తున ఆకాశంలో ఈవిమానాలు తిరగాడుతున్నాయి. రెండు విడతలుగా సాగిన దాడుల్లో నష్టం అసాధారణ స్థాయిలో వున్నదనిఅంటున్నారు. అయితే తాలిబన్ వర్గాలు మాత్రం నష్టాన్ని గురించిపెదవి విప్పడం లేదు. అఎn్గాన్లో ప్రజల వద్ద వున్న సంపద నిజానికి చాలా తక్కువ. అత్యధిక శాతం మంది ప్రజలు టెంట్లలో నివసించేవారే. గట్టి కట్టడాలు చాలా తక్కువ సంఖ్యలో వున్నాయి.